Tollywood Cinema : పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ హీరోయిన్స్ తో ఎంత డీసెంట్ గా ప్రవర్తిస్తారో చాలా మంది ఆయనతో నటించిన వారు చెప్పారు. ఆయన మామూలుగానే సిగ్గరి. కెరీర్ ప్రారంభంలో హీరోయిన్ వచ్చి పక్కన కూర్చున్నా పెద్దగా మాట్లాడింది లేదట. మెల్లగా అమ్మాయిలతో కలవడం అలవాటు చేసుకున్నారు. ఇక ఆయన సినిమాలో హీరోయిన్ గా నటించిన వారికి ఇంటి భోజనం తినిపించి సంతోషపడతారు.
హీరోయిన్స్ కి మాత్రమే కాదు, సినిమా యూనిట్ సభ్యులందరికీ ప్రభాస్ ఇంటి భోజనం పెట్టిన సందర్భాలెన్నో ఉన్నాయి. డార్లింగ్ సరసన నటించిన వారు ఆయన గొప్పతనం గురించి ఎన్నో విధాలుగా చెబుతుంటారు. అంత సున్నితంగా ఉండే ప్రభాస్ కి పూజా హెగ్డే కోపం తెప్పించిన సందర్భం కూడా ఒకటి ఉంది. ప్రభాస్, పూజా హెగ్డే జంటగా రాధే శ్యామ్ వచ్చింది. పాన్ ఇండియన్ లెవల్ లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఆశించిన సక్సెస్ అందుకోలేకపోయింది.
![Tollywood Cinema : ప్రభాస్ తో అలా ప్రవర్తించినందుకే పూజా హెగ్డే కి ఈ గతి పట్టిందా..? tollywood-cinema-Did Pooja Hegde get this fate because of how she behaved with Prabhas..?](http://natelugu.com/wp-content/uploads/2023/10/pooja.gif)
Tollywood Cinema : ప్రభాస్ ని కూడా లెక్క చేయని పూజా హెగ్డే..!
ఈ సినిమా కోసం యూవీ వారు బాగానే ఖర్చు పెట్టారు. బాలీవుడ్ నిర్మాణ సంస్థ కూడా భాగస్వామ్యంలో ఉంది. మొత్తానికి భారీ నష్టాలనే మిగిల్చింది రాధే శ్యామ్. ఇక ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో పూజా హెగ్డే మేకర్స్ కి సహకరించలేదని అప్పట్లో బాగా ప్రచారం జరిగింది. ఫారిన్ లో ప్లాన్ చేసిన ఓ షెడ్యూల్ కూడా క్యాన్సిల్ కావడానికి కారణం పూజా అని వార్తలు వచ్చాయి. ఆ షెడ్యూల్ క్యాన్సిల్ అవడంతో నిర్మాతలకి కొన్ని కోట్ల వరకు నష్టం కూడా వచ్చిందట.
అయినా కూడా పూజా హెగ్డేని భరించారని, అయితే సినిమా ప్రమోషన్స్ లో మాత్రం అంతగా సహకరించలేదని, ఈ విషయంలో అడిగితే ప్రభాస్ ని కూడా లెక్క చేయలేదని ఇండస్ట్రీ వర్గాలలో టాక్ వినిపించింది. దాంతో ఈ విషయం టాలీవుడ్ అంతా పాకిపోయి..మళ్ళీ కొత్త సినిమాలలో పూజాకి ఛాన్స్ ఇవ్వాలంటే నిర్మాతలు లైట్ తీసుకుంటున్నారట. ప్రభాస్ లాంటి మంచి నటుడితో పెట్టుకుంటే మళ్ళీ టాలీవుడ్లో ఛాన్సులు వస్తాయా..? అంటూ అటు ఫ్యాన్స్ ఇటు మేకర్స్ అంటున్నారట. చూస్తుంటే మళ్ళీ పూజా తెలుగులో మునుపటి లీడ్ కాకపోవచ్చు అనిపిస్తోంది.