Health: శీతాకాలం వచ్చిదంటే చలి తీవ్రత ఎక్కువగా ఉండటం వలన ఉదయం నిద్ర లేవడానికి కూడా చాలా మంది ఇబ్బంది పడుతూ ఉంటారు. రెగ్యులర్ గా ఉంటే డే సైకిల్ శీతాకాలం చాలా మంది జీవితాలలో మారిపోతుంది. దానికి కారణం చలికి తట్టుకోలేకపోవడమే. అలాగే శీతాకాలంలో చాలా మంది చన్నీళ్ళ స్నానం చేయడానికి ఇష్టపడరు. హీటర్ తోనో, లేదంటే గీజర్ తోనే, లేదంటే గ్యాస్ పైన వేడి చేసకుని స్నానం చేస్తూ ఉంటారు. వేడి నీళ్లు లేకుండా ఉదయాన్నే స్నానం చేయడానికి కూడా సాహసించరు. అయితే రోజువారీ ఉద్యోగాల కారణంగా తప్పనిసరి పరిస్థితిలో స్నానం చేయకపోతే శరీరం నుంచి దుర్వాసన వస్తుందనే ఆలోచనతో తప్పనిసరి పరిస్థితిలో స్నానం చేస్తారు. అది కూడా వేడి నీళ్లతోనే చేస్తారు.
అయితే వేడినీళ్లతో స్నానం చేయడం వలన చాలా నానార్ధాలు ఉంటాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎప్పటికి శరీరాన్ని శుభ్రం చేసుకోవడానికి చన్నీళ్ళ స్నానమే ఉత్తమం అని అంటున్నారు. అయ్యప్ప స్వామిదీక్షలో ఉన్నవారు వేకువ జామున చన్నీళ్ళతోనే స్నానాలు ఆచరిస్తారు. ఇలా చేయడం వలన శరీరంలోని కణాలు ఉత్తేజితం అయ్యి రోజంతా ఉత్సాహంగా ఉంచుతాయి. ఒత్తిడిని ఈ చన్నీళ్ళు దూరం చేస్తాయి. అయితే వేడి నీళ్లతో స్నానం చేయడం వలన శీతాకాలంలో మరింతగా చర్మం పొడిబారిపోవడం జరుగుతుంది. శరీరంలో చర్మ రక్షణ కోసం సహజసిద్ధమైన ఆయిల్ ని ఉత్పత్తి చేస్తుంది. వేడినీటితో స్నానం చేయడం వలన ఈ సహజసిద్ధ ఆయిల్ ఉత్పత్తి మందగిస్తుంది. ఈ కారణంగా చర్మం మరింతగా పొడిబారిపోతుంది. అలాగే వేడినీళ్లతో తలస్నానం అస్సలు చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
చుండ్రు, మురికి సులభంగా వదులుతుందనే ఆలోచనతో వేడినీళ్లతో చాలా మంది తలస్నానం చేస్తారు. అలా చేయడం వలన చర్మ సంబంధమైన అలర్జీ వస్తుందని డర్మటాలజిస్ట్ లు చెబుతున్నారు. వేడినీళ్లతో స్నానం చేయాల్సి వస్తే కచ్చితంగా 5 నిమిషాల్లో మీ స్నానం ముగించాలని అంటున్నారు. అలాగే చలికాలంలో చర్మం పొడిబారిపోకుండా ఉండాలంటే స్నానం చేసే ముందుగా శనగపిండి, పసుపు, పెరుగు లేదా పాలు మిశ్రమంతో ఒక పేస్ట్ లా తయారు చేసి దానిని శరీరానికి పట్టించి ఒక అరగంట తర్వాత స్నానం చేయాలి. ఇలా చేయడం వలన చర్మం పొడిబారిపోకుండా జాగ్రత్త పడొచ్చు. చలికాలంలో వీలైనంత వరకు వేడినీళ్లతో స్నానం చేయకపోవడమే ఉత్తమం అని వైద్య నిపుణులు అంటున్నారు. కాసేపు కష్టమైన చన్నీళ్ళతోనే స్నానం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని కూడా చెబుతున్నారు.