Fri. Nov 14th, 2025

    Pregnant: పెళ్లైనటువంటి ప్రతి ఒక్క మహిళ తల్లి కావాలని కోరుకుంటారు. ఈ విధంగా మహిళలు గర్భం దాల్చిన తర్వాత ఎన్నో రకాల జాగ్రత్తలను తీసుకుంటూ ఉంటారు. ముఖ్యంగా వారు తీసుకునే ఆహార విషయంలో ఎన్నో జాగ్రత్తలను పాటిస్తూ ఉంటారు. గర్భం దాల్చిన మహిళలు ఆరోగ్యంగా ఉండాలన్న తమ బిడ్డ ఎదుగుదల మంచిగా ఉండాలన్న తప్పనిసరిగా కొన్ని పండ్లను తినడం ఎంతో మంచిది. ఈ క్రమంలోనే తల్లి బిడ్డల ఆరోగ్యం కొరకు కొన్ని రకాల పండ్లను తినకపోవడం ఎంతో మంచిదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.

    మరి గర్భం దాల్చిన మహిళలు ఏ విధమైనటువంటి పండ్లను తినకూడదు అనే విషయానికి వస్తే.. గర్భం దాల్చిన మహిళలు పైనాపిల్ తినకూడదు. పైనాపిల్ లో బ్రొమెలైన్‌ అనే కంటెంట్ అధికంగా ఉంటుంది.అందువ‌ల్ల‌, గ‌ర్భిణీ స్త్రీలు పైనాపిల్ తీసుకుంటే గర్భం విఛ్చినం కావటమో లేదంటే నెలలు నిండకనే డెలివరీ అయ్యే అవకాశాలు ఉంటాయి.

    పైనాపిల్ తో పాటు నల్ల గ్రేప్స్ తినకపోవడం కూడా ఎంతో మంచిది. ఎందుకంటే, గ‌ర్భ‌వుతులు న‌ల్ల ద్రాక్ష తీసుకుంటే. జీర్ణ స‌మ‌స్య‌లు అత్య‌ధికంగా ఉంటాయి. వీటితోపాటు పచ్చి బొప్పాయి పండును కూడా తినకపోవడం ఎంతో మంచిది ఇందులో కూడా గర్భం ఇచ్చిన హార్మోన్లు ఉంటాయి కనుక గర్భం దాల్చిన మహిళలు పచ్చి బొప్పాయను చేయకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతుంటారు.