సాధారణంగా స్థానిక సంస్థల ఎన్నికల్లో కొన్ని చోట్ల ఏకగ్రీవాలు చేసుకోవడం, మరికొన్ని చోట్ల బలమైన స్థానాలపైనే దృష్టి పెట్టడం పార్టీల వ్యూహంగా ఉంటుంది. కానీ జగన్ మాత్రం ఇందుకు భిన్నంగా కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్క స్థానంలోనూ వైసీపీ అభ్యర్థి పోటీలో ఉండాల్సిందేనని, ఎక్కడా ప్రత్యర్థులకు ఏకగ్రీవమయ్యే అవకాశం ఇవ్వకూడదని కేడర్కు ఖచ్చితమైన లైన్ ఇచ్చారు. పార్టీ ఉనికిని చాటడానికి ఇది అవసరమని అధిష్టానం భావిస్తున్నప్పటికీ, గ్రౌండ్ లెవెల్ లీడర్స్ మాత్రం ఈ నిర్ణయంతో తీవ్ర ఆందోళనలో మునిగిపోయారు.

Andhra Pradesh: అధిష్ఠానం ఆదేశాల మేరకు పోటీకి సిద్ధమవ్వాలంటే
ప్రస్తుతం ప్రతిపక్షంలో ఉన్నందున, అధికార పార్టీ ఉధృతిని తట్టుకుని ఎన్నికల బరిలో నిలవడం కత్తిమీద సామేనని కేడర్ భావిస్తోంది. పార్టీ లైన్ కోసం తాము ఆర్థికంగా నష్టపోవాలా అని ద్వితీయ శ్రేణి నాయకత్వం వెనకడుగు వేస్తోంది. మరి జగన్ తీసుకున్న ఈ టాప్-టు-బాటమ్ పోటీ నిర్ణయం పార్టీని యాక్టివ్గా ఉంచుతుందా, లేక క్యాడర్లో మరింత అసంతృప్తిని రగిలిస్తుందా అనేది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.

