Fri. Jun 12th, 2026

    Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి అయినప్పటికీ తిరుమల ఆలయంలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. ఇక స్వామివారి దర్శనం కోసం భక్తులు ఎప్పటిలాగే గంటల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితిని ఏర్పడ్డాయి. ప్రస్తుతం స్వామివారి దర్శనం కోసం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని అన్ని కంపార్ట్మెంట్ లు భక్తులతో నిండి పోయాయి. క్యూలైన్లు గోగర్భం డ్యామ్ వరకు విస్తరించాయి.

    టీటీడీ అధికారులు చెప్పిన వివరాల మేరకు సర్వదర్శనం కోసం వచ్చే భక్తులు సుమారు 18 నుంచి 24 గంటల వరకు వేచి ఉండాల్సి వస్తుందని తెలిపారు. ప్రత్యేక దర్శనంలో భాగంగా 300 రూపాయల టికెట్ కొనుగోలు చేసిన భక్తులకు స్వామివారి దర్శనం కోసం మూడు నుంచి ఆరు గంటల సమయం పడుతుందని తెలుస్తుంది. వేసవి సెలవులు దాదాపు పూర్తి అయి తిరిగి స్కూల్స్ కాలేజీలు ప్రారంభమైనప్పటికీ తిరుమలలో భక్తుల రద్దీ ఏమాత్రం తగ్గలేదని చెప్పాలి.

    tirumala-heavy-devotee-rush-18-hours-for-srivari-sarva-darshan-know-more-details
    tirumala-heavy-devotee-rush-18-hours-for-srivari-sarva-darshan-know-more-details

    Tirumala: తిరుమలలో కొనసాగుతున్న భక్తుల రద్దీ..

    తిరుమల శ్రీవారిని నిన్న ఒక్కరోజే ఏకంగా 75,428 మంది భక్తులు దర్శించుకున్నారు. అలాగే 42,566 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.50 కోట్లకు చేరగా, టీటీడీ 4.34 లక్షల లడ్డూలను కొనుగోలు చేశారు. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో స్లాటెడ్ సర్వదర్శనం (SSD) టోకెన్లు ఉదయానికే పూర్తయ్యాయి. దీంతో ముందస్తు టోకెన్లు లేని భక్తులు క్యూలైన్లలోనే గంటల తరబడి స్వామి వారి దర్శనం కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితులు వచ్చాయి. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతున్న నేపథ్యంలో భక్తుల సౌకర్యాల కోసం టీటీడీ అధికారులు ఏ విధమైనటువంటి అసౌకర్యం తలెత్తకుండా అన్ని ఏర్పాట్లను నిర్వహిస్తున్నారు. క్యూలైన్లో వేచి ఉన్న భక్తుల కోసం ఆహారం తాగునీరు పాలు వంటి పదార్థాలను అందచేసేలా ఏర్పాటను నిర్వహించారు.