Tue. Jan 20th, 2026

    Aditi Rao : కోలీవుడ్ హీరోయిన అదితి రావ్ హైదరీ, నటుడు సిద్దార్థ్ తమ నిశ్చితార్థాన్ని ప్రకటించి స్నేహితులను, అభిమానులను ఆశ్చర్యపరిచారు. ఈ ఒక్క అనౌన్స్‎మెంట్‎తో వారి రిలేషన్ గురించి వస్తున్న పుకార్లకు అధికారికంగా చెక్ పెట్టారు. అయితే వీరిద్దరి ఎంగేజ్మెంట్ వనపర్తిలోని 400 ఏళ్ల నాటి పురాతన ఆలయంలో జరిగిన విషయం తెలిసిందే. అయితే ఈ ఇద్దరు అక్కడే వేడుక ఎందుకు చేసుకోవాల్సి వచ్చిందో తాజాగా అదితి తెలిపింది. తను నటించిన హీరామండి వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా చేసిన ఇంటర్వ్యూలో అదితి తన ఎంగెజ్మెంట్ గురించి ఇంట్రెస్టింగ్ విషయాలను పంచుకుంది.

    aditi-rao-opens-about-engagement-with-hero-siddarth
    aditi-rao-opens-about-engagement-with-hero-siddarth

    గత నెలలో అదితి, సిద్దార్థ్ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో ఉన్న అత్యంత పురాతన శ్రీరంగపురం ఆలయంలో వీరి నిశ్చితార్థం జరిగింది. అయితే ఈ వేడుక జరిగే వరకు ఎవరికీ ఈ విషయం తెలియదు. ఇద్దరూ చాలా సీక్రెట్ గా తమ ఎంగేజ్‌మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాలు, అత్యంత సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. నటి అదితి రావ్ హైదరీ వనపర్తి సంస్థానాధీశుల వారసురాలు. అందుకే ఆ గుడి పురోహితులు దగ్గరుండి మరీ ఈ వేడుకను సంప్రదాయ పద్ధతుల్లో జరిపించారు. నిశ్చితార్థం తర్వాత అదితి రావు రింగ్స్ తో ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అధికారికంగా తమకు ఎంగేజ్మెంట్ జరిగిందని తెలిపింది. కానీ ఎక్కడా కూడా దీని గురించి మాట్లాడలేదు.

    aditi-rao-opens-about-engagement-with-hero-siddarth
    aditi-rao-opens-about-engagement-with-hero-siddarth

    రీసెంట్ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..” నా తల్లి కోరిక మేరకే నేను నిశ్చితార్థం చేసుకున్నాను. నా ఎంగేజ్‌మెంట్ తర్వాత అమ్మకు చాలా కాల్ వచ్చాయి. నిజంగానే అదితి పెళ్లి చేసుకుందా అని అందరూ అమ్మ అడిగేవారు. అమ్మ ఆ కాల్స్ బాధ చూడలేక ఎంగేజ్మెంట్ గురించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇవ్వమని చెప్పింది. దీంతో నేను, సిద్ధార్థ్‌ ఈ విషయంపై పోస్ట్‌లు పెట్టాం. నా నిశ్చితార్థం 400 ఏళ్ల నాటి గుడిలో జరిగింది. ఆ గుడితో మా ఫ్యామిలీకి ప్రత్యేక అనుబంధం ఉంది . అందుకే అక్కడ చేసుకున్నాను.