Tirumala Tirupati: తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ప్రతిరోజు కోట్లాదిమంది భక్తులు స్వామి వారిని దర్శనం చేసుకుంటూ ఉంటారు అయితే తిరుమల స్వామివారిని దర్శనం చేసుకోవడానికి విదేశీయులు కూడా పెద్ద ఎత్తున తరలివస్తున్న సంగతి తెలిసిందే. ఇలా విదేశాల నుంచి స్వామివారి దర్శనం కోసం వస్తున్న భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్తను తెలియజేసింది.. విదేశాల నుంచి స్వామి వారి దర్శనం కోసం వచ్చే ఎన్నారైల సౌకర్యార్థం సుపథం మార్గం ద్వారా కల్పించే ప్రత్యేక ప్రవేశ దర్శన కాలపరిమితిని భారీగా పెంచుతూ టీటీడీ నిర్ణయం తీసుకుంది.
ఎన్నారైలకు ప్రత్యేక ప్రవేశ దర్శనం గడువు ప్రస్తుతం కేవలం 30 రోజులు మాత్రమే ఉండేది అయితే ఈ 30 రోజులను 90 రోజులకు పెంచారు. ఈ నిబంధనలు జూన్ 6వ తేదీ నుంచి అమలులోకి వచ్చాయి.ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. విదేశాల నుంచి స్వదేశానికి వచ్చిన 30 రోజుల్లోనే ఎన్ఆర్ఐలు తమ ఒరిజినల్ పాస్పోర్టు, వీసా ఆధారంగా తిరుమలలోని సుపథం మార్గం ద్వారా రూ. 300 టికెట్ తీసుకొని స్వామి వారిని దర్శనం చేసుకునే వెసులుబాటు ఉండేది. ఇలా 30 రోజులు గడువు మాత్రమే ఉన్న నేపథ్యంలో ఎన్నారై లకు సరైన సమయం లేకపోవడంతో స్వామి వారిని దర్శనం చేసుకోలేకపోతున్నట్లు భక్తుల నుంచి ఫిర్యాదులు వచ్చాయి.

Tirumala Tirupati: భక్తుల ఫిర్యాదులపై టీటీడీ సానుకూల స్పందన..
ఇలా ఎన్నారై భక్తుల నుంచి వచ్చిన ఫిర్యాదులను దృష్టిలో ఉంచుకున్న టీటీడీ యాజమాన్యం, ప్రవాస భారతీయుల సౌకర్యార్థం ఆ గడువును 90 రోజులకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఇలా 90 రోజులు గడువు పెంచడంతో ఎన్నారై భక్తులు ఏ విధమైనటువంటి ఇబ్బందులు లేకుండా స్వామివారిని దర్శనం చేసుకునే వెసులు బాటును కల్పించింది. భక్తుల సౌకర్యాలను దృష్టిలో పెట్టుకొని టీటీడీ ఎప్పటికప్పుడు కీలక నిర్ణయాలను తీసుకుంటున్న నేపథ్యంలో భక్తులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు భక్తుల రద్దీ దృష్ట్యా బాటగంగమ్మ సర్కిల్ నుండి గోగర్భం సర్కిల్ వరకు సరికొత్తగా శాశ్వత క్యూలైన్ను ఏర్పాటు చేయాలని టీటీడీ కీలక నిర్ణయం తీసుకుంది.

