Fri. Dec 12th, 2025

    Tollywood: సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన బాలయ్య కూతురు బ్రాహ్మణి నటించబోతుందా..? అనే వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. అయితే, వాస్తవానికి ఇది ఇప్పటి విషయం కాదు. 15 ఏళ్ళ క్రితం నాటి మాట అట. 2005 లో మహేశ్ బాబు హీరోగా అతడు సినిమా వచ్చిన సంగతి అందరికీ తెలిసిందే. ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్ దర్శకత్వం వహించారు. నటుడు నిర్మాత మురళీ మోహన్ నిర్మించారు.

    మహేశ్ కెరీర్‌లోనే మంచి సినిమాగా నిలిచిన ఈ చిత్రం ఆశించిన వసూళ్ళను మాత్రం రాబట్టలేకపోయింది. కారణం ఓవర్ బడ్జెట్. దీనికి కారణం కూడా దర్శకుడే అని ఇప్పటికీ చెప్పుకుంటుంటారు. ఆ విషయం అలా పక్కన పెడితే, మహేశ్ సరసన అతడు సినిమాలో నటించాల్సిన హీరోయిన్ బాలయ్య కూతురు బ్రాహ్మణి అట. బాలయ్యను చాలామంది మీ అమ్మాయిని హీరోయిన్‌గా పరిచయం చేయవచ్చు కదా..అని అడిగారట.

    tollywood-Brahmani paired with Mahesh Babu..did you imagine this combination..?
    tollywood-Brahmani paired with Mahesh Babu..did you imagine this combination..?

    Tollywood: ‘అతడు’ కోసం మహేశ్ బాబు సరసన బ్రాహ్మణి ని అనుకొని త్రిష ని ఫిక్స్ చేసుకున్నారట.

    బ్రాహ్మణి హీరోయిన్స్ కంటే ఏమాత్రం తీసిపోదు. అందానికి అందం టాలెంట్ అన్నీ ఉన్నాయి. అయితే, సినిమాలంటే మాత్రం ఆసక్తి లేదట. సరదాగా ఎంటర్‌టైన్మెంట్ కోసం సినిమా చూస్తుంది గానీ, సినిమాలో హీరోయిన్‌గా మాత్రం నటించే ఇంట్రెస్ట్ లేదని ముందు నుంచి చెప్పిందట. అందుకే బాలయ్య ఏనాడు బ్రాహ్మణి ని సినిమాలలో నటిస్తావా..? అని అడగలేదట. అతడు కోసం మహేశ్ బాబు సరసన బ్రాహ్మణి ని అనుకొని ఆమె నో అనగానే నెక్స్ట్ ఛాయిస్ గా త్రిష ని ఫిక్స్ చేసుకున్నారట.

    ఇక బ్రాహ్మణి గురించి అందరికీ తెలిసిందే. చిన్నప్పటి నుంచి చదువులో ఫస్ట్. గోల్డ్ మెడల్ సాధించింది. బాలయ్య మాట ఏనాడు దాటలేదు. మిగతా వారిలాగా ప్రేమ వ్యవహారం నడపలేదు. నారా వారి ఇంటికి కోడలైంది. లోకేశ్ భార్యగా ఆ ఇంట్లో అన్నీ బాధ్యతలను చక్కగా నిర్వర్తిస్తుంది. పొలిటికల్ పరంగా కూడా బ్రాహ్మణి ఎంతో చురుగ్గా ఉంటుంది. భవిష్యత్తులో వస్తే గనక రాజకీయాలలోకి వచ్చే అవకాశం ఉంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.