Sugarcane: సాధారణంగా మనం ఆహార పదార్థాలను కనుక తీసుకుంటే వెంటనే నీరు తాగేఅలవాటు ప్రతి ఒక్కరికి ఉంటుంది.అది మనం ఏ ఆహార పదార్థాలను తీసుకున్న లేదా చిరుతిళ్లు తీసుకున్న లేదా పండ్లను తిన్నా కూడా చాలామంది వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. ఈ విధంగా తిన్న వెంటనే నీళ్లు తాగడం కొన్నిసార్లు మనకు ఎంతో మేలు చేస్తుంది. అయితే కొన్ని ఆహార పదార్థాలను తిన్న తర్వాత పొరపాటున కూడా నీళ్లను తాగకూడదని చెబుతుంటారు. ఇలా కొన్ని ఆహార పదార్థాలను తిన్న వెంటనే నీళ్లు తాగితే ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది.
ముఖ్యంగా చాలామంది చెరుకు తిన్న వెంటనే నీళ్లు తాగుతూ ఉంటారు. ఈ విధంగా చెరుకు తిన్న తర్వాత నీటిని తాగితే కనుక ఆరోగ్య సమస్యలు తప్పవని నిపుణులు చెబుతున్నారు. మరి చెరుకు తిని నీటిని తాగటం వల్ల ఏ విధమైనటువంటి సమస్యలు వస్తాయి అనే విషయానికి వస్తే… చెరుకులో మనకు ఎక్కువగా కాల్షియం, పొటాషియం వంటి ఇతర మినరల్స్ చాలా పుష్కలంగా లభిస్తాయి. అందుకే చెరుకు తిన్న వెంటనే నీళ్లు తాగటం వల్ల ఇవన్నీ నీటితో కలిసిపోతాయి.
Sugarcane:
ఇలా మినరల్స్ నీటితో రియాక్షన్ జరిపినప్పుడు తీవ్రమైన కడుపునొప్పి ఉబ్బరం ఛాతిలో పట్టేయడం వంటి సమస్యలు తలెత్తుతాయి. మౌత్ అల్సర్ తలనొప్పి వంటి సమస్యలు కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అందుకే చెరుకు తిన్న వెంటనే నీళ్లను ఒక గంట పాటు తాగకపోవడం ఎంతో మంచిది.అలాగే ఏదైనా సలాడ్స్ తీసుకున్నప్పుడు నువ్వులు తీసుకున్నప్పుడు వాటర్ కంటెంట్ అధికంగా ఉన్నటువంటి పండ్లను తీసుకున్నప్పుడు కూడా నీటిని తాగకూడదు.