Devotional Tips: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఉదయం సాయంత్రం పెద్ద ఎత్తున దీపారాధన చేస్తూ ఇష్ట దైవాన్ని పూజిస్తూ ఉంటారు. ఇలా ప్రతిరోజు ఉదయం సాయంత్రం పూజ చేయటం వల్ల ఇంట్లో ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ మొత్తం తొలగిపోయి పాజిటివ్ వైబ్రేషన్స్ ఏర్పడతాయి అలాగే మనసు కూడా చాలా ప్రశాంతంగా ఉండటం వల్ల అనుకున్న పనులు ఎంత సక్రమంగా నెరవేరుతూ ఉంటాయి. అందుకే ప్రతిరోజు ఉదయం సాయంత్రం దీపారాధన చేస్తూ ఉంటారు.
ప్రతి ఒక్కరు కూడా దేవుడి కోసం ప్రత్యేకంగా చిన్న మందిరాన్ని నిర్మించుకొని ఉంటారు. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఆ గదిలోకి ఎవరు వెళ్లకుండా ఉండడం కోసం తలుపులు కూడా ఏర్పాటు చేసుకునే ఉంటారు. అయితే చాలామంది పూజ చేసిన తర్వాత తలుపులు వేయకూడదని చెబుతుంటారు అలాగే మరికొందరు వేసిన ఎలాంటి సమస్య లేదు అని చెబుతుంటారు.ఇక కొందరైతే దీపం వెలుగుతూ ఉండగానే వారే స్వయంగా దీపాన్ని కొండెక్కించి దేవుడి గదికి తలుపులు వేస్తుంటారు అసలు ఇలా చేయడం మంచిదేనా శాస్త్రం ఏం చెబుతుంది అనే విషయానికి వస్తే…
Devotional Tips:
శాస్త్రం ప్రకారం దీపారాధన వెలుగుతూ ఉన్నప్పుడు దేవుడు గదికి తలుపులు వేయకూడదు అనే నియమం ఎక్కడా లేదు. అదేవిధంగా స్వయంగా దీపాన్ని కొండ ఎక్కించి దేవుడి గదికి తలుపులు వేయకూడదు ఇలా చేయటం పాపమని పండితులు చెబుతున్నారు. శాస్త్రం ప్రకారం పూజ చేసిన తర్వాత కొంత సమయం పాటు దేవుడు గది తలుపులు తెరిచి ఉంచవచ్చు అయితే కొంత సమయం తర్వాత దీపాలు వెలుగుతూ ఉన్నప్పటికీ దేవుడు గదికి తలుపులు వేయడం వల్ల ఏ విధమైనటువంటి సమస్య లేదని కొత్త సమయం పాటు తెరిచి ఉంచితే చాలని పండితులు చెబుతున్నారు.