Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి అధికారులు కీలక సూచనలను జారీ చేశారు. మరి కొద్ది రోజులలో శ్రీవారి వార్షిక సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో అందుకు అనుగుణంగా టీటీడీ ఏర్పాట్లను ప్రారంభించింది. ఇందులో భాగంగానే కొన్ని కీలక మార్పులను చేపట్టింది. ఇలా ముందస్తు ఏర్పాట్లలో భాగంగా శ్రీవారి పుష్కరిని ప్రవేశాలను నిలిపివేస్తూ టీటీడీ అధికారులు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ విషయం గురించి భక్తులకు అధికారకంగా వెల్లడించారు. త్వరలోనే సాలకట్ల బ్రహ్మోత్సవాలు జరగబోతున్న నేపథ్యంలో శ్రీవారి పుష్కరిణలో కొన్ని పనులు ప్రారంభించిన నేపథ్యంలో పుష్కరిని ప్రవేశాలను నిలిపివేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు.
పుష్కరినిలో పలు మరమ్మత్తుల నేపథ్యంలోనే ఆగస్టు 1వ తేదీ నుంచి సెప్టెంబర్ 10వ తేదీ వరకు భక్తులకు పుష్కరిణికి అనుమతులు లేవని వెల్లడించింది. ఇలా సుమారు 40 రోజులపాటు పుష్కరిణి మూసివేసి ఉంటుందని అధికారులు తెలిపారు. ఈ 40 రోజుల సుదీర్ఘ వ్యవధిలో భక్తులను పుష్కరిణిలో స్నానాలకు అనుమతించరు. ప్రతిరోజు సాయంత్రం వేళ అత్యంత పవిత్రంగా నిర్వహించే ‘పుష్కరిణి హారతి’ కూడా ఉండదని అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలోనే తిరుమల వెళ్లే భక్తులు ఈ విషయాలను దృష్టిలో పెట్టుకొని ముందస్తు ప్రణాళికలను చేసుకోవాలని సూచించారు.

Tirumala: శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు..
సెప్టెంబర్ 15వ తేదీ నుంచి శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభం కానున్నాయి. బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండడం కోసమే ముందస్తు సమాచారాన్ని తెలియజేశారు.పుష్కరిణిలో అవసరమైన ప్రధాన మరమ్మతు పనులు, శుభ్రపరిచే కార్యక్రమాలను చేపట్టనున్నారు. పుష్కరిణిలోని నీటిని పూర్తిగా తొలగించి మరమ్మత్తులో అనంతరం పవిత్ర జలంతో నింపే ప్రక్రియను అధికారులు నిర్వహించనున్నారు. ఈ పనులు ఆగస్టు 31వ తేదీ వరకు జరగనున్నాయి అయితే సెప్టెంబర్ 1 నుంచి సెప్టెంబర్ 10 మధ్య కాలంలో భారీ వర్షాలు, తుఫాన్లు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తుల భద్రతను దృష్టిలో ఉంచుకొని సెప్టెంబర్ 10 వరకు పుష్కరిని మూసివేస్తున్నట్లు తెలిపారు.

