Tirumala Hundi: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి ఆలయానికి నిత్యం భక్తులు లక్షలాది సంఖ్యలో పోటెత్తున్నారు. నిత్యం స్వామి వారి దర్శనం కోసం దేశ విదేశాలనుంచి కూడా భక్తులు వస్తున్నారు. ఇలా స్వామివారిని దర్శించుకున్న అనంతరం మొక్కలు చెల్లించుకుంటూ పెద్ద ఎత్తున కానుకలను సమర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బుధవారం తిరుమల వెంకటేశ్వర స్వామి హుండీ ఆదాయం రికార్డ్ స్థాయిలో నమోదైనట్టు తెలుస్తుంది. గురువారం ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు స్వామివారి హుండీ కానుకులను లెక్కించారు.
బుధవారం ఒక్కరోజు స్వామి వారి హుండీ ద్వారా కానుకల రూపంలో రూ.6.93 కోట్ల రూపాయలు వచ్చినట్లు అధికారులు తెలియచేశారు. తిరుమల ఆలయ చరిత్రలో ఒక రోజులోనే ఇలా హుండీ ఆదాయం ఆరు కోట్ల పైగా రావడం ఇది మూడోసారి. బుధవారం కొంతమంది అజ్ఞాత భక్తులు పెద్ద ఎత్తున కానుకలు సమర్పించిన నేపథ్యంలో ఈ స్థాయిలో హుండీ కానుకలు వచ్చాయని అధికారులు తెలిపారు. ఇక స్వామివారి దర్శనం విషయానికి వస్తే.. శ్రీవారి సర్వదర్శనానికి భక్తుల రద్దీ కొనసాగుతోంది సర్వదర్శనం కోసం 24 గంటల పాటు సమయం పడుతుంది అదే విధంగా ఈ వారాంతంలో వరుసగా సెలవులు వస్తున్న నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ కూడా పెరుగుతుంది.

Tirumala Hundi: ఆదివారం విఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు..
ఇలా కొండపైకి భక్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో ఆదివారం స్వామివారి విఐపి బ్రేక్ దర్శనాలను నిలిపివేస్తున్నట్లు అధికారులు ఉత్తర్వులు జారీచేశారు. ఈ విషయాన్ని గుర్తించి భక్తులు తిరుమలకు వెళ్లాలని తెలిపారు. ఇలా ఆదివారం విఐపి బ్రేక్ దర్శనాలు రద్దు చేసిన నేపథ్యంలో శనివారం భక్తుల నుంచి ఎలాంటి సిఫార్సులను తీసుకోవడం లేదు. ఇక వరుసగా మూడు రోజులు సెలవులతో పాటు సెప్టెంబర్ 15 నుంచి స్వామివారి బ్రహ్మోత్సవాలు కూడా ప్రారంభమవుతున్న నేపథ్యంలో కొండపై భక్తుల రద్దీ కొనసాగుతుందని చెప్పాలి.

