water: మన శరీరానికి ఆహారంతో పాటు మీరు కూడా ఎంతో అవసరం మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం అవ్వడానికి అదేవిధంగా మన శరీరంలోని అన్ని జీవక్రియలు సక్రమంగా జరగడానికి నీటిని తాగడం ఎంతో ముఖ్యమని ఆరోగ్య విపులు చెబుతూ ఉంటారు. అయితే చలికాలంలో వాతావరణంలో మార్పులు రావటం వల్ల చాలా మంది అధిక మొత్తంలో నీటిని తీసుకోరు. ఇలా చలికాలంలో తక్కువ మొత్తంలో నీటిని తాగటం వల్ల ఎన్నో సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు.
![water: చలికాలం అని నీటిని తక్కువగా తాగుతున్నారా... సమస్యలు తప్పవు జాగ్రత్త! why-does-the-body-lack-water-in-winter-stay-hydrated-in-these-ways](http://natelugu.com/wp-content/uploads/2024/01/MixCollage-12-Jan-2024-11-03-AM-2955.jpg)
చలికాలంలో చలికి తట్టుకోలేక మనలో చాలామంది నీటిని తక్కువ మొత్తంలో తీసుకుంటూ ఉంటారు. ఇలా తక్కువ మొత్తంలో నీటిని తీసుకోవడం వల్ల మనకు తెలియకుండానే మన శరీరం మొత్తం డిహైడ్రేషన్ భారీన పడుతుంది. తద్వారా చర్మం మొత్తం పొడి మారిపోతుంది. అదే విధంగా మనం తీసుకున్నటువంటి ఆహారం జీర్ణం కాగా మలబద్ధకం ఏర్పడుతుంది. ఒత్తిడికి గురికావడం, చిరాకు, విశ్రాంతి లేకపోవడం, తల తిరగడం మొదలైన సమస్యలు తలెత్తుతాయి. అందువల్ల చలికాలంలో కూడా నీటిని అధికంగా తీసుకోవడం ఎంతో ముఖ్యం.
చల్లగా వాతావరణం ఉండడంతో నీటిని తాగడానికి ఇష్టపడలేనటువంటి వారు నీటి శాతం అధికంగా కలిగినటువంటి పండ్లు కూరగాయలు తాగడం ఎంతో మంచిది. ఇక నీటిని తాగాలనిపించని వారు కాస్త నీటిలోకి నిమ్మరసం కలుపుకొని జ్యూస్ లా తయారు చేసుకోవాలి. అలాగే చలికాలంలో వేడివేడిగా సూప్ తీసుకోవటం వల్ల కూడా మన శరీరానికి తగిన మొత్తంలో నీరు అంది మన హైడ్రేట్ గా ఉంటుంది. ఇలా చలికాలంలో వీలైనంతవరకు నీటి శాతాన్ని కలిగిన పదార్థాలు తీసుకోవడం ఎంతో మంచిది.