Mon. Jul 6th, 2026

    Tirumala: కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. ఇందులో పండు ముసలి వాళ్ళతో పాటు చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ లకు ప్రత్యేక దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిన్నపిల్లలతో తిరుమల వెళ్లే భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.

    ఈ నేపథ్యంలోనే ఏడాదిలోపు వయసు ఉన్నటువంటి పిల్లలతో కలిసి తిరుమల వెళ్తున్న తల్లిదండ్రులు సుపదం ఎంట్రెన్స్ ద్వారా ఉచిత ప్రవేశ దర్శనాలను కల్పిస్తోంది. ఈ ప్రత్యేక దర్శనం ద్వారా సుమారు ఒక గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ దర్శనం కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉంటాయనే విషయానికి వస్తే.. సుపదం ఎంట్రన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే వారు తమ బిడ్డ వయసుకు సంబంధించి భర్త సర్టిఫికెట్ తో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కూడా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.

    Tirumala free darshan for parents children below one year under supadam entrance know details
    Tirumala free darshan for parents children below one year under supadam entrance know details

    Tirumala: సుపదం ఎంట్రన్స్ ద్వారా ఉచిత దర్శనం..

    ఇలా ఈ డాక్యుమెంట్స్ తో తిరుమలలోని సుపదం ఎంట్రన్స్ వద్దకు వెళ్లాలి. ఈ దర్శనం కోసం ఎలాంటి టికెట్లు అవసరం లేదు. దర్శన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏడాదిలోపు వయసున్న చిన్నారులు తల్లితండ్రులు ఉచితంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనానికి వెళ్లేవారు పిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువులను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. చిన్నారులకు అవసరమైన పాలు నీళ్లు డైపర్లు వెంట తీసుకెళ్లాలి అదేవిధంగా చిన్నారులకు అవసరమైన మెడిసిన్ కూడా తల్లిదండ్రులు వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్నారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో పాటు చిన్నారి బర్త్డే సర్టిఫికెట్ కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెంట తీసుకువెళ్లాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో దర్శనం కోసం ఒక అరగంట అదనపు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.