Nagula Chavithi: నాగుల చవితి అనేది శ్రావణ మాసంలో వచ్చే శుద్ధ చతుర్థి రోజున జరుపుకునే ముఖ్యమైన పండుగ. ఈ రోజు నాగదేవతను పూజిస్తారు. హిందూ ధర్మంలో నాగులు దేవతలుగా, భూమికి రక్షకులుగా భావిస్తారు. వ్యవసాయానికి నాగులు ఎంతో మేలు చేస్తాయి కాబట్టి రైతులు ఈ పండుగను ప్రత్యేకంగా జరుపుకుంటారు. నాగు అంటే పాము, చవితి అంటే నాలుగో రోజు అని అర్థం. ఈ రోజు పుట్టల వద్ద దీపాలు వెలిగించి, పాలు, పసుపు, కుంకుమతో పూజ చేస్తారు.
పురాణాల ప్రకారం ఆదిశేషుడు విష్ణుమూర్తికి పాన్పుగా ఉంటాడు. అలాగే శివుని మెడలో వాసుకి ఉంటాడు. నాగులు భూమి అంతర్భాగంలో నివసిస్తూ భూమిని తమ పడగతో పట్టుకుని ఉన్నాయని నమ్మకం. అందుకే వాటిని సంతృప్తిపరిస్తే భూమి సారవంతంగా ఉంటుందని, పంటలు బాగా పండుతాయని రైతుల నమ్మకం. పుట్టలో పాలు పోయడం ద్వారా నాగదేవతల ఆగ్రహానికి గురికాకుండా వారి అనుగ్రహం పొందవచ్చని పెద్దలు చెబుతారు.
శాస్త్రీయంగా చూస్తే కార్తీక మాసంలో చలి పెరిగి పాములు చలికి తట్టుకోలేక పుట్టల్లోకి చేరతాయి. ఈ సమయంలో వాటికి ఆహారం దొరకడం కష్టం. అందుకే మన పెద్దలు పుట్టలో పాలు, గుడ్లు పోసే ఆచారాన్ని పెట్టారు. పాలు పోయడం వల్ల పాములకు పోషకాలు అందుతాయి. అంతేకాకుండా పుట్ట చుట్టూ పసుపు, కుంకుమ వేయడం వల్ల క్రిమికీటకాలు దూరంగా ఉంటాయి. ఈ విధంగా మానవుడు మరియు ప్రకృతి మధ్య సమతుల్యత ఏర్పడుతుంది.

Nagula Chavithi: నాగ దోషాలు తొలగిపోతాయి..
నాగుల చవితి రోజున పుట్టలో పాలు పోయడం వల్ల కుటుంబంలోని నాగదోషాలు తొలగిపోతాయని, సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఆడవారు ఉపవాసం ఉండి పుట్టకు పూజ చేసి, చెలిమిడి, నువ్వుల లడ్డూలు నైవేద్యంగా సమర్పిస్తారు. ఈ పండుగ ద్వారా ప్రకృతిని గౌరవించడం, ప్రతి జీవిని ప్రేమించడం అనే సందేశం మనకు అందుతుంది. నాగుల చవితి అనేది కేవలం ఆచారం మాత్రమే కాదు, మానవుడు ప్రకృతితో మమేకమై జీవించాలనే గొప్ప సందేశాన్ని ఇస్తుంది. ఇక ఈ ఏడాది ఆగస్టు16 న నాగల చవితి వేడుకలను జరుపుకుంటారు.

