Thambulam: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం తాంబూలం ఇవ్వడం అనేది చాలా సాంప్రదాయంగా వస్తున్నటువంటి ఆచారం మన ఇంటికి ఎవరైనా ముత్తైదువులు వస్తే వారు వెళ్లేటప్పుడువారికి తాంబూలం ఇవ్వడం చేస్తుంటాము అలాగే ఏదైనా పూజ కార్యక్రమాలు సమయంలోను శుభకార్యాల సమయంలోను వ్రతాలు చేసేటప్పుడు కూడా ఇంటికి వచ్చిన అతిథులకు తాంబూలం ఇస్తుంటాము ఇలా తాంబూలం ఇచ్చే సమయంలో ఎలా పడితే అలా ఇవ్వకూడదని, తాంబూలం విషయంలో కూడా కొన్ని నియమాలు పాటించాల్సి ఉంటుందని పండితులు చెబుతున్నారు.
ముందుగా శుభ్రంగా మూడు తమలపాకులను కడిగి తీసుకోవాలి వాటిని తొడిమెలతో సహా ఉంచాలి. వాటిలో రెండు ఒక్కలు పెట్టాలి ఇక ఏదైనా పండ్లు పెట్టే సమయంలో రెండు పండ్లను పెట్టి ఇవ్వాలి ఒకటి ఇవ్వకూడదు.వీటితోపాటు పసుపు కుంకుమ పువ్వులను కూడా తాంబూలంలో పెట్టి ఇవ్వాలి అయితే తాంబూలంలో పెట్టి ఇచ్చేటప్పుడు తమలపాకు తొడిమలు మన వైపు ఉండేలా చూసుకొని వారికి పసుపు రాసికుంకుమ బొట్టు పెట్టి తాంబూలం ఇవ్వాలి అనంతరం తాంబూలం తీసుకున్న వారు కూడా ఇచ్చిన వారికి కుంకుమ బొట్టు పెట్టాలి.
Thambulam:
ఇలా తాంబూల విషయంలో కూడా ఈ పద్ధతులను పాటించడం వల్ల ఇచ్చిన వారికి ఎంతో మంచి కలుగుతుంది. ఇక తాంబూలం ఇచ్చే సమయంలో చాలామంది బ్లౌజ్ పీస్ లేదా శారీ కూడా ఇస్తూ ఉంటారు.అయితే తాంబూలం విషయంలో ఈ పద్ధతులు పాటించడం ఎంతో మంచిది. ఇక వరలక్ష్మీ వ్రతం చేసుకునేవారు చీకటి పడక ముందే ముత్తైదువులకు వాయనం ఇవ్వాలి. ముత్తైదువులకు ఉదయమే వాయనం ఇవ్వడం మంచిది. సాయంత్రం ఇచ్చినా కూడా చీకటి పడక ముందే వాయనం ఇవ్వడం ఎంతో మంచిది.