Curd Rice: మనం భోజనం చేసే సమయంలో తప్పకుండా మన రోజువారి ఆహారంలో భాగంగా పెరుగు తప్పకుండా ఉండాల్సిందే చాలా మందికి పెరుగు తినండి వారి భోజనం పూర్తికాదు. ఇలా మధ్యాహ్నం రాత్రి భోజనం చేసే సమయంలో తప్పకుండా ఆహారంలో భాగంగా పెరుగు ఉండాల్సిందే.అయితే పడుకునే సమయంలో పెరుగు తిని పడుకోవడం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఇలాంటి వ్యాధులతో బాధపడేవారు రాత్రి సమయంలో పెరుగు తినకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
ఎవరైతే దగ్గు జలుబు ఆస్తమా వంటి సమస్యలతో బాధపడుతూ ఉంటారో అలాంటి వారు రాత్రి భోజనంలో పెరుగు తీసుకోకపోవడం మంచిది. పెరుగు కాస్త తీపి,పులుపుగా ఉంటుంది.అయితే రాత్రి భోజనంలో భాగంగా పెరుగు తీసుకొని పడుకోవటం వల్ల నాసిక మార్గంలో స్లేష్మం ఏర్పడుతుంది. తద్వారా ఊపిరి తీసుకోవడానికి ఇబ్బందులు తలెత్తుతూ ఆస్తమా రావడానికి కారణం అవుతుంది. అంతేకాకుండా సమస్యలతో బాధపడేవారు పెరుగును తినడం వల్ల తీసుకున్న ఆహారం సరిగా జీర్ణం కాదు. తద్వారా కడుపు ఉబ్బరం వంటి సమస్యలు కూడా ఏర్పడతాయి.
Curd Rice:
ఇలా ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు పెరుగును మాత్రం తీసుకోకూడదు అలా కాకుండా పెరుగు తినేటప్పుడు అందులోకి కాస్త చక్కెర లేదా నిమ్మకాయ కలుపుకొని తినడం వల్ల మనం తీసుకున్న ఆహారం బాగా జీర్ణం అవడంతో గ్యాస్ ఏర్పడటం కడుపు ఉబ్బరం వంటి సమస్యలు పూర్తిగా తొలగిపోతాయి.. అందుకే ఈ విధమైనటువంటి సమస్యలతో బాధపడేవారు మధ్యాహ్న భోజనంలో పెరుగు తీసుకున్న రాత్రి భోజనంలో మాత్రం పెరుగు తీసుకోకపోవడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.