Tue. Feb 10th, 2026

    Rashmika Mandanna: టాలీవుడ్ క్రష్ రష్మిక మందన్న ఇటీవల తన కొత్త వ్యాపార ప్రయాణాన్ని ప్రారంభించింది. నిన్న, మొన్న ఊదరగొట్టినట్లుగానే చివరకు తన కొత్త వెంచర్‌ను అధికారికంగా ప్రకటించింది. ‘డియర్ డైరీ’ అనే పేరుతో ఓ ప్రత్యేకమైన పెర్‌ఫ్యూమ్ లైనప్‌ను లాంఛ్ చేసింది. ఇది సాదాసీదా బ్రాండ్ కాదని, తన జీవితంలో scent (పరిమళం) ఎంత ముఖ్యమో చెబుతూ.. ఇది తన వ్యక్తిత్వంలో ఓ భాగమని చెప్పుకొచ్చింది రష్మిక.

    “పరిమళం నా జీవితం లో ఓ భాగం. ఇప్పుడు అదే పరిమళాన్ని మీ అందరితో పంచుకోవడం నన్ను చాలా ఉత్సాహపరుస్తోంది, అదే సమయంలో కొంచెం భయంగా కూడా ఉంది. ఈ ప్రయాణంలో మీరు అందరూ నాకు ఆశీస్సులు ఇవ్వాలి,” అంటూ ఎంతో భావోద్వేగంతో తన పెర్‌ఫ్యూమ్ బ్రాండ్‌ను ప్రస్థావించింది.

    rashmika-mandanna-enterd-into-perfume-business
    rashmika-mandanna-enterd-into-perfume-business

    Rashmika Mandanna: విజయ్ దేవరకొండ వంటి వ్యక్తులు కూడా..

    ఈ లాంఛనానికి సెలబ్రిటీలు, అభిమానులు మంచి స్పందన ఇచ్చారు. విజయ్ దేవరకొండ వంటి వ్యక్తులు కూడా ఆమెకు బలంగా మద్దతుగా నిలిచారు. ప్రస్తుతానికి ఈ బ్రాండ్ ఆన్‌లైన్ అమ్మకాలకు మాత్రమే అందుబాటులో ఉంది. వేదికగా ఎంపికైన ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ ద్వారా వినియోగదారులు కొనుగోలు చేయవచ్చు. నాలుగు వేరియంట్లు అందుబాటులో ఉండగా, ఒక్కో బాటిల్ గరిష్ట ధర రూ.2599 గా ఉంది.

    ఇక త్వరలోనే ఫిజికల్ ఔట్‌లెట్స్ కూడా ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. రష్మిక ఈ వ్యాపారంతో తన అభిరుచిని, వ్యక్తిత్వాన్ని, ఎమోషనల్ కనెక్ట్‌ను ప్రేక్షకులతో పంచుకోవాలనుకుంటోంది. ఫ్యాషన్, లైఫ్‌స్టైల్‌లోనే కాదు ఇప్పుడు ఫ్రాగ్రెన్స్ సెక్టార్‌లోనూ రష్మిక తన ముద్ర వేసే ప్రయత్నంలో ఉంది.

    By VSR

    విఎస్అర్ - సీనియర్ సబ్ ఎడిటర్: 5 సంవత్సరాలుగా.. సినిమా, హెల్త్, ఎడ్యుకేషన్, స్పిరిచువల్..వార్తలను రాస్తున్నారు. ప్రముఖ సోషల్ మీడియా వెబ్‌సైట్స్‌లో రాసిన అనుభవం కలదు. 2017 నుంచి సబ్ ఎడిటర్‌గా పని చేస్తున్నారు.