Prabhas: పాన్ ఇండియన్ స్టార్ Prabhas ‘KGF’ చిత్రాల క్రేజీ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో తెరకెక్కిన భారీ యాక్షన్ ఎంటర్టైనర్ Salaar. ఈ సినిమాపై ప్రపంచవ్యాప్తంగా భారీ స్థాయిలో అంచనాలుండగా అసలు ఈ మూవీ స్టోరీ ఏంటీ..? అని ప్రభాస్ ఫ్యాన్స్ దగ్గర్నుంచి అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో దర్శకుడే Salaar కథేంటో చిన్న లైన్ ద్వారా లీక్ చేశారు.
శృతి హాసన్, పృథ్విరాజ్ సుకుమారన్ కీలక పాత్రల్లో నటించారు. హోంబలే నిర్మాణ సంస్థలో విజయ్ కిరంగదూర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. అయితే, తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో చిత్ర దర్శకుడు ప్రశాంత్ నీల్ Salaar కథ ఇద్దరు ప్రాణ స్నేహితులకి సంబంధించినది. వారు అనుకోని కారణాల వల్ల బద్ద శత్రువులుగా మారతారు. ఈ నేపథ్యంలో కథ సాగుతుంది. యాక్షన్ తో పాటు సెంటిమెంట్ ఎమోషన్స్ కూడా ఉంటాయి.
ప్రభాస్, పృథ్విరాజ్ సుకుమారన్ లాంటి స్టార్ ఉన్నారని Salaar ని రెండు భాగాలుగా తీయడం లేదు. కథ మొత్తం 6 గంటల వరకూ వచ్చింది. అందుకే, రెండు భాగాలుగా ప్లాన్ చేశామని క్రేజ్ కోసం కాదని క్లారిటీ ఇచ్చారు. మొదటి భాగం ఈ డిసెంబర్ 22న ప్రపంచవ్యాప్తంగా అన్ని సౌత్ భాషలతో పాటు బాలీవుడ్ లో కూడా రిలీజ్ అవుతుంది. ఈ సినిమాకి గట్టి పోటీగా ‘Dunki’ ఉంది. ఇక రెండవ భాగం ఎప్పుడు రిలీజ్ అవుతుందనేది ఇంకా క్లారిటీ లేదు.
కాగా, Salaar పూర్తైయ్యాక సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో ‘Spirit’ చిత్రాన్ని చేయనున్నాడు. ఇప్పటికే, ‘Kalki’ సినిమా షూటింగ్ లో కూడా ప్రభాస్ పాల్గొంటున్నాడు. ఇది సైంటిఫిక్ థ్రిల్లర్ గా పాన్ వరల్డ్ స్థాయిలో రూపొందుతోంది. బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్, దీపిక పడుకొన్ ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఇది కాకుండా మారుతి దర్శకత్వంలో కూడా ప్రభాస్ ఒక సినిమా చేయనున్నాడు.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.