Minister Mallareddy : బాలీవుడ్ హీరో రణబీర్, కపూర్ సౌత్ బ్యూటీ రష్మిక కలిసి యాక్ట్ చేసిన మూవీ ‘యానిమల్’. సౌత్ సెన్సేషనల్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా యానిమల్ మూవీని తెరకెక్కించాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, టీజర్స్, సాంగ్స్, ట్రైలర్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. డిసెంబర్ 1న ఈ సినిమా థియేటర్స్లో రిలీజ్ కానుంది. దీనితో మూవీ మేకర్స్ దేశవ్యాప్తంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ లను నిర్వహిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ లోని మల్లారెడ్డి ఇంజనీరింగ్ కాలేజీ గ్రౌండ్లో యానిమల్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సూపర్ స్టార్ మహేష్ బాబు, టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ రాజమౌళి తో పాటు మినిస్టర్ మల్లారెడ్డి స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచారు.
ఈ గ్రాండ్ ఈవెంట్ లో మంత్రి మహేష్ బాబు,రణబీర్ కపూర్ పై ఆసక్తికర కామెంట్స్ చేశారు. మంత్రి మాట్లాడుతూ..” ఈ రోజు మల్లారెడ్డి వర్సిటీకి యానిమల్ మూవీ టీమ్ వచ్చింది. హీరో మహేష్ బాబు వచ్చారు. మీకు తెలుసా నేను మహేష్ బాబు బిజినెస్ మెన్ సినిమా చూసి పాలిటిక్స్ లోకి వచ్చాను. ఈ సినిమా 10 సార్లు చూసి ఎంపీ అయ్యా. రణబీర్ నేనొక విషయం చెప్తాను విను.
ఒకప్పుడు బాలీవుడ్, హాలీవుడ్ను తెలుగు స్టార్స్ ఎలుతారని చెప్పాను. మా తెలుగు హీరోలు చాలా స్మార్ట్. రాజమౌళి, దిల్ రాజు.. ఇప్పుడు సందీప్ వంగా వచ్చాడు. పుష్ప సినిమాతో అల్లు అర్జున్ ఇరగదీశాడు . ఇప్పుడు సందీప్ కూడా సేమ్ రిపీట్ చేస్తాడు. బాలీవుడ్లో దుమ్మురేపడం ఖాయం. మల్లారెడ్డి వర్సిటీ లో నాలుగు సార్లు అశ్వమేధ యాగం జరిపించాం . ఇక్కడ చదువుకున్న వారు ఇంజనీర్లు, డాక్టర్లుగా స్థిరపడ్డారు. ఇక్కడ ఏ సినిమా రిలీజ్ అయినా 500 కోట్ల కలెక్షన్స్ వసూలు చేయడం ఖాయం. సూపర్ హిట్ అందుకోవడం ఖాయం” అంటూ మల్లారెడ్డి చెప్పుకొచ్చారు.
AP POLITICS: రాజకీయాల్లో విమర్శలు, ప్రతివిమర్శలు సహజం. కానీ ఆ విమర్శలు హద్దులు దాటి వ్యక్తిగత దూషణలకు దిగితేనే అసలు…
Film Updates: టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద ప్రతి వారం యుద్ధం జరగడం మామూలే. కానీ ఈ వారం రాబోతున్న రెండు…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ‘అమరావతి’ ఎప్పుడూ ఒక రగులుతున్న కుంపటే. ఐదేళ్ల పాటు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడూ అమరావతి…
Film Updates: టాలీవుడ్లో ఎనర్జిటిక్ స్టార్గా తనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ను సొంతం చేసుకున్న రామ్ పోతినేని, ప్రస్తుతం తన…
Cinema News: తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచ నలుమూలలా చాటిచెప్పిన దర్శకధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి అంతర్జాతీయ స్థాయిలో మరో అరుదైన ఘనతను…
TTD: కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి క్షేత్రంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్ అనంత్ అంబానీ భక్తి పారవశ్యం చాటుకున్నారు.…
This website uses cookies.