Lord Shiva: సాధారణంగా మన హిందూ సంప్రదాయాల ప్రకారం ప్రతిరోజు ఒక దేవుడికి అంకితం చేయబడి ఆ రోజున ఆ దేవదేవతలకు ప్రత్యేకంగా పూజలు చేస్తారు ఈ నేపథ్యంలోను సోమవారం పరమశివుడికి అంకితం చేయబడింది. సోమవారం స్వామివారికి పెద్ద ఎత్తున అభిషేకాలు అలంకరణలతో పూజిస్తూ శివయ్య కరుణ కటాక్షాలను పొందుతూ ఉంటారు. అయితే నేడు జూలై 13 మాత్రం అత్యంత పవిత్రమైన రోజు అని చెప్పాలి.జులై 13న వచ్చే సోమవారం ఆరుద్ర నక్షత్రం, మాస శివరాత్రి కలయికతో. వచ్చింది.
ఇలా ఆరుద్ర నక్షత్రం, కృష్ణ చతుర్దశ మాస శివరాత్రితో కలిసి సోమవారం రావటం వల్ల ఈ సోమవారం ఎంతో పవిత్రమైన రోజుగా భావిస్తారు. ఈ సోమవారం శివుడిని పూజించడం వల్ల 100 శివరాత్రులతో సమానంగా శివుడిని పూజించిన ఫలితం లభిస్తుంది. ఈ అరుదైన రోజున శివుడిని భక్తితో పూజించి, శివలింగానికి అభిషేకం చేసి పూజించటం వల్ల స్వామివారి కరుణ కటాక్షాలు మనపై ఉండటమే కాకుండా ఆర్థిక ఇబ్బందులను తొలగించి అష్టైశ్వర్యాలను కలిగిస్తారని భావిస్తారు. అదేవిధంగా మీ దగ్గరలోని శివాలయానికి వెళ్లి స్వామి వారిని పూజించడం ఎంతో మంచిది. ఇక ఆలయానికి వెళ్లలేని వారు ఈ పూజ చేయడం మంచిది.

Lord Shiva: జూలై 13 న మహాశైవాక్షయోగం..
ఉదయమే నిద్ర లేచి తల స్నానం చేసిన అనంతరం శివుడి చిత్రపటానికి చక్కగా అలంకరణ చేసుకోవాలి స్వామి వారికి ఎంతో ఇష్టమైన మారేడు దళాలతో పూజ చేయడం మంచిది. ఇంట్లో శివలింగం ఉన్నవారు పంచామృతంతో అభిషేకం చేయడం వల్ల స్వామివారి అనుగ్రహం పొందవచ్చు. నేడు శివుడికి అభిషేకం చేయటం వల్ల ఎన్నో జన్మల పాపాలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు. ఇలా అభిషేకం అనంతరం స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించి ఓం నమశ్శివాయ అనే మంత్రాన్ని 108 సార్లు పటించాలి. శివ పంచాక్షరి మంత్రాన్ని జపించాలి. ఇక స్వామివారికి దద్దోజనాన్ని నైవేద్యంగా సమర్పించడం వల్ల శివుని అనుగ్రహం పొందవచ్చు. ఇలా జులై 13న మహాశైవాక్షయోగం ఏర్పడింది. మరి ఇలాంటి అద్భుతమైన పవిత్రమైన రోజు 2053,అలాగే 2070 లో వస్తుంది. అందుకే ఇలాంటి పవిత్రమైన రోజున శివుడిని ఆరాధించడం వల్ల శని బాధలు కూడా తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.

