Health care: నీరు మన ఆరోగ్యానికి మంచిదనే సంగతి మనకు తెలిసిందే. ఇలా నీరు తాగటం వల్ల మన శరీరం డిహైడ్రేషన్ కి గురి కాకుండా ఉంటుంది అలాగే మన శరీరంలోని జీవక్రియలు అన్నీ కూడా ఎంతో సక్రమంగా జరుగుతూ ఉంటాయి. అయితే మనం నీరసించి పోయిన వెంటనే డాక్టర్లు కానీ మనకు నీటిని తాపించమని చెప్తుంటారు కానీ ప్రసవం తర్వాత మహిళలు బాగా అలసిపోయి ఉంటారు తీవ్రమైన నొప్పిని భరిస్తూ ప్రసవం అయిన తర్వాత వారి శరీరం పూర్తిగా నీరసించి పోతుంది. అలాంటి సమయంలో నీరు తాపించాలని చెబుతారు.
అయితే మరి కొందరు నీళ్లు తాపించడం వల్ల అదనపు సమస్యలు వస్తాయని చెబుతుంటారు మరి ప్రసవం తర్వాత నీటిని తాపించడం మంచిదేనా అలాగే ప్రసవం తర్వాత చల్లనీటిని తాగకూడదా అసలు డాక్టర్లు ఏం చెబుతున్నారు అనే విషయానికి వస్తే.. ప్రసవం తర్వాత చాలామంది చల్ల నీటిని తాగకూడదని చెబుతారు. అలా ఎందుకు చెబుతారు అనే విషయానికి వస్తే ప్రసవం సమయంలో మన శరీరం పూర్తిగా అలసిపోయి ఉంటుంది తద్వారా మన శరీరానికి వెచ్చదనం అవసరం కావడంతో వేటి నీటిని చాపుతారో అలాగే కూడా పూర్వస్థితికి రావడానికి చల్ల నీళ్లు అడ్డుగా ఉంటాయని వేడి నీళ్లు తాగమని చెబుతారు.
చల్లని నీరు తల్లి పాల నాణ్యత, ఉష్ణోగ్రతను ప్రభావితం చేస్తుంది. చల్లని నీరు, పానీయాలు మీ నవజాత శిశువుకు జలుబు, ఇతర సమస్యలకు కారణం అవుతుంది. ఇక ప్రసవం తర్వాత వీలైనంతవరకు నీటిని తీసుకోవడం మంచిదే. ఇలా నీటిని తీసుకోవడం వల్ల త్వరగా పాలు ఉత్పత్తి అవుతాయి. ఒకవేళ ప్రసవం తర్వాత నీటిని అధికంగా తీసుకోకపోతే తీవ్రమైన బలహీనత ఏర్పడటమే కాకుండా మలబద్ధక సమస్య వెంటాడుతుంది అలాగే శరీరం మొత్తం డిహైడ్రేషన్ కి కూడా గురి అవ్వడమే కాకుండా నీరసం ఉంటుంది.