Tirumala Seva: కలియుగ దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం ప్రతి రోజు లక్షలాది మంది భక్తులు తిరుమల చేరుకుంటూ ఉంటారు. అయితే స్వామివారి సేవలో భాగంగా వేలాది సంఖ్యలో భక్తులు తిరుమల చేరుకొని స్వామివారి సేవ కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. అయితే ఇకపై స్వామివారి వివిధ సేవలలో పాల్గొనే భక్తులకు టిటిడి వయోపరిమితిని విధించింది. ఇలా టీటీడీకి నిర్ణయించిన వయసులోపు ఉన్నవారు మాత్రమే స్వామి వారి సేవకులుగా వెళ్లే అవకాశం ఉంటుందని తెలిపారు. మరి స్వామివారి ఏ సేవకు ఎంత వయో పరిమితి అనే విషయానికి వస్తే..
శ్రీవారి సేవ: సాక్షాత్తు స్వామివారి సేవకు వెళ్లాలనుకునే సేవకుల వయస్సు తప్పనిసరిగా 18 నుండి 60 సంవత్సరాల మధ్య ఉండాలి.
సూపర్వైజర్ సేవ: 45 నుండి 65 సంవత్సరాలు.
నవనీత సేవ: 35 నుండి 50 సంవత్సరాల వయస్సు వారు అర్హులు.
పరకామణి సేవ: ఈ సేవ కోసం వెళ్లే సేవకుల విషయానికి వస్తే ప్రభుత్వ ఉద్యోగులు అయితే 18 నుంచి 65 వయసు వారి వరకు అర్హులు ప్రభుత్వ ఉద్యోగులు కాని వారికి18 నుంచి 60 సంవత్సరాలు వారు అర్హులు. ఇక స్వామివారి వివిధ సేవా కార్యక్రమాలలో పాల్గొనాలనుకునే భక్తులు కచ్చితంగా తిరుమల తిరుపతి దేవస్థానం అధికారక వెబ్సైట్ ద్వారా అప్లై చేసుకోవాలని టీటీడీ చూసించింది.

Tirumala Seva: చిన్నపిల్లలకు అనుమతి లేదు..
స్వామివారి సేవలో భాగంగా వెళ్లే సేవకులకు టీటీడీ మరికొన్ని కీలక సూచనలు చేసింది. శ్రీవారి సేవకు వచ్చే భక్తులు ఎలాంటి పరిస్థితులలో కూడా వారి వెంట చిన్నపిల్లలను తీసుకొని రాకూడదని తెలిపింది. 60 సంవత్సరాలు దాటిన భక్తులను స్వామివారి సేవకు అనుమతించబడదు కానీ వారు వయోవృద్ధుల దర్శనం అలాగే ఇతర ప్రత్యేక దర్శనాలకు అర్హులు. ఇక నిన్నటి రోజున తిరుమల స్వామి వారినీ 66,304 మంది భక్తులు దర్శించుకున్నారు. 4.51 కోట్ల హుండీ ఆదాయం వచ్చినట్టు టీటీడీ తెలిపింది.SSD టోకెన్ లేనివారికి స్వామివారి దర్శనం కోసం సుమారు 12 గంటల సమయం పడుతున్నట్లు తెలుస్తోంది.

