Categories: Tips

Technology: 2030 నాటికి స్మార్ట్ ఫోన్స్ అంతరించిపోతున్నాయా… ఈ విషయం తెలుసుకోవాల్సిందే

Technology: సాంకేతిక విజ్ఞానం చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. ఎన్నడూ లేని విధంగా గత 25 ఏళ్ల కాలంలో టెక్నాలజీలో ఎన్నో ఊహించని మార్పులని చూస్తున్నాం. ఓ విధంగా జెట్ స్పీడ్ తో ఈ విజ్ఞానం దూసుకుపోతుంది. ల్యాండ్ లైన్ ఫోన్ వాడే కాలం నుంచి ఈ పాతికేళ్ళలో 4జీ టెక్నాలజీతో స్మార్ట్ ఫోన్స్ వాడే స్థాయికి వచ్చేసాం. అలాగే ఇంటర్నెట్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతుంది. చేతిలో స్మార్ట్ ఫోన్స్ ఇప్పుడొక అత్యవసర వస్తువు క్రింద అయిపొయింది.

అలాగే ఇంటర్నెట్ వినియోగం కూడా మానవ మనుగడలో ఒక కీలక భూమిక పోషిస్తుంది. ప్రపంచాన్ని ఇప్పుడు ఇంటర్నెట్ శాసిస్తుంది అని చెప్పాలి. కోట్లాది మంది ఇంటర్నెట్ ఆధారంగానే ఉద్యోగాలు చేస్తున్నారు. సాఫ్ట్ వేర్  కంపెనీలు తమ పనులన్నీ కూడా అంతర్జాల ప్రపంచం ద్వారానే కొనసాగిస్తున్నాయి. ప్రస్తుతం టెక్నాలజీ మానవ మేధస్సు లేకుండా పనిచేసే స్థాయికి చేరిపోయింది. ఆటోమిషన్, ఆర్టిఫీషియల్ ఇంటలిజెన్స్ ద్వారా మానవ మేధస్సుని కూడా పసిగట్టే స్థాయిలో టెక్నాలజీ అభివృద్ధి చెందింది.

మన చేతిలో ఉన్న ఫోన్ కూడా ఒక రోబోలా మన మాట, ఆలోచనని బేస్ చేసుకొని నడిచే స్థాయికి విజ్ఞానం అభివృద్ధి చెందుతుంది. ఇండియాలో 4జీ టెక్నాలజీ నడుస్తూ ఉంటె జపాన్, అమెరికా లాంటి దేశాలు 5జీలో నడుస్తున్నాయి. వచ్చే ఏడాది నాటికి ఇండియాలో కూడా 5జీ టెక్నాలజీ తీసుకొచ్చే ప్రయత్నం భారత ప్రభుత్వం చేస్తుంది. ఇదిలా ఉంటే రానున్న 8 ఏళ్లలో టెక్నాలజీలో ఊహించని ఎన్నో మార్పులని మనం చూడబోతున్నాం అని విజ్ఞాన ప్రపంచం అభివృద్ధి చూస్తూ ఉంటే అర్ధమవుతుంది.

ఇదిలా ఉంటే 2030 నాటికి ప్రస్తుతం మనం ఉపయోగిస్తున్న స్మార్ట్ ఫోన్ లు పూర్తిగా కనుమరుగావుతాయని నోకియా సీఈవో పెక్కా లాండ్మార్క్ వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సందర్భంగా తన ప్రసంగంలో పేర్కొనడం ఇప్పుడు సర్వత్రా ఆసక్తిగా మారింది. భవిష్యత్తులో 6జీ టెక్నాలజీ అందుబాటులోకి వస్తే ప్రస్తుతం ఉన్న స్మార్ట్ ఫోన్ లు పాతబడిపోతాయని, కేవలం పురాతన వస్తువులుగా మాత్రమే గుర్తించబడతాయని చెప్పారు. స్మార్ట్ ఫోన్ లలో చాలా ఫీచర్స్ శరీరంలోనే నేరుగా అందించే అవకాశం ఉంటుందని తెలిపారు. న్యూరాలింక్ బేస్ డివైజ్ లని న్యూరాలింక్ అనే సంస్థ ఇప్పటికే అభివృద్ధి చేస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో కమ్యునికేషన్ రంగంలో అవి చాలా కీలకంగా మారే అవకాశం ఉందని తెలుస్తుంది.

Varalakshmi

Recent Posts

Tirumala: తిరుమలలో తగ్గని భక్తుల రద్దీ.. శ్రీ వారి సర్వ దర్శనానికి 18 గంటల సమయం !

Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…

54 minutes ago

AP POLITICS: జగన్‌కు భారీ షాక్.. అమరావతిపై కేంద్రం సంచలన నిర్ణయం!

AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్‌కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…

22 hours ago

Peddi Collections: బాక్సాఫీస్ వద్ద చరణ్ సునామీ.. ఫస్ట్ వీక్ కలెక్షన్స్ ఇవే!

Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…

23 hours ago

Breast Cancer: మహిళల్లో పెరుగుతున్న రొమ్ము క్యాన్సర్లు.. తెలుసుకోవలసిన విషయాలు ఇవే!

Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…

1 day ago

Politics: తెలంగాణపై మోదీ కన్ను.. రూటు మార్చిన రేవంత్‌..!

Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…

1 day ago

Politics: ఇక నంబర్ 1 ఆయనే.. మోదీ అరుదైన రికార్డ్‌..!

Politics: భారత రాజకీయ చ‌రిత్ర‌లో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…

1 day ago

This website uses cookies.