Spirtual: ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మతాలు వేరైనా, ఆయా మతాలలో పూజించే దేవుళ్ళు వేరైనా మనిషిని నడిపించేది మాత్రం దేవుడు అనే నమ్మకమే. ఆ నమ్మకం మీదనే మానవ మనుగడ సాగుతుంది. ఈ నమ్మకంతోనే ఏదైనా పని చేసేముందు ఎక్కడికైనా వెళ్ళే ముందు భగవంతుడ్ని వేడుకోవడం అందరికి ఒక అలవాటుగా ఉంది. మనల్ని సమస్యల నుంచి, కష్టాల నుంచి బయటపడేస్తాడు అనే నమ్మకంతో ఆ దేవుడ్ని ఆరాధించడం, శరణు వేడుకోవడం, ప్రతిఫలంగా ఏదో ఒకటి ఇస్తామని మొక్కుకోవడం ప్రజలు చేస్తున్నారు. కొందరు భగవంతుడి మీద భారం వేసి తాము చేయాలనుకున్న పని చేసుకొని వెళ్తారు.
ఫలితం వచ్చాక అది దైవానుగ్రహంతోనే వచ్చింది అనే నమ్మకంతో మొక్కిన మొక్కులు చెల్లించుకుంటారు. తిరుమల వెంకన్నకి కోట్లాది రూపాయిల ఆదాయం వస్తుందన్న, ఇంకా ఏ దేవాలయంలో అయిన దేవుడిని దక్షిణలు వస్తున్నాయన్న చాలా వరకు ఈ మొక్కుల కారణంగానే అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. మన పూర్వకాలం నుంచి మన సమాజంలో ఒక ఆచారం వస్తుంది. ఒకరి నుంచి మనం ఏదైన ఆశిస్తే, అది వారు ఇచ్చినపుడు ప్రతిఫలంగా మనం ఏదో ఒకటి ఇవ్వాలి. ఇలా ఇచ్చుపుచ్చుకోవడం అనే వ్యవహారం సనాతనంగా మన నాగరికతలోనే ఉంది మనిషికి మనిషి ఇలా ఇచ్చుపుచ్చుకుంటున్నప్పుడు.
మనందరి పుట్టుకకి కారణం అయ్యి ఈ అనంత విశ్వాన్ని నడిపిస్తున్న ఈ దేవాది దేవుడు మనకి ఒకటి ఇస్తున్నప్పుడు ప్రతిఫలంగా మనకి తోచింది ఇవ్వడంలో తప్పేంటి అనేది చాలా మంది చెప్పే మాట. ఆ నమ్మకం, విశ్వాసం నుంచి భగవంతుడికి దండం పెట్టి ఒక ప్రతిఫలం ఆశించి అది జరిగితే నీకు నేను ఫలానా ఇది ఇస్తా అని మొక్కుకోవడం అనేది ఒక అలవాటుగా మారిపోయింది. ఇది హిందువులలో మరీ ఎక్కువగా ఉంటుంది. గ్రామ దేవతల నుంచి ముక్కోటి దేవతలలో చాలా మందికి ఆలయాలు ఉన్నాయి. కోరిన కోర్కెలు తీర్చే కల్పవల్లి అనే పేర్లు కూడా కొంత మంది దేవతలకి ఉన్నాయి. ఆ పేర్లు వెనుక ప్రజల అంతులేని విశ్వాసం దాగి ఉంటుంది. దాంతో అలా గుర్తింపు పొందిన దేవాలయాలకి వెళ్లి మొక్కుకోవడం ఆనవాయితీగా మారిపోయింది. అయితే మొక్కుకున్న తర్వాత ఫలితం వచ్చాక ఆ మొక్కులు చెల్లించుకోకుంటే జీవితంలో చాలా ఇబ్బందులు, అరిష్టాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఒక ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళారు.
దీంతో మొక్కులు చెల్లించకపోతే ఏదో జరుగుతుందనే భయంతో అందరూ మొక్కులు చెల్లించుకోవడం జరుగుతుంది. అయితే ఈ భయం అనేది అంతర్లీనంగా మనుషుల మనసులలోకి సనాతన కాలం నుంచి వెళ్ళిపోవడంతో అది ఒక నెగిటివ్ వైబ్ గా మారి మనల్ని వెంటాడుతుంది. అంతర్లీనంగా మనలో గూడు కట్టుకున్న మన భయం మనల్ని మరింత ఆందోళనని కలిగిస్తుంది. ఈ నెగిటివ్ వైబ్ వలన కచ్చితంగా ఏదో ఒక ప్రమాదాలు నిజంగానే సంభవించడం జరుగుతాయి. అవి జరిగినపుడు మొక్కులు చెల్లించకపోవడం వలనే అనే భయాన్ని ఎవరో ఒకరు ప్రస్తావిస్తూ దానిని గుర్తు చేస్తారు. ఇలా మనుషులలో పూర్వకాలం నుంచి మనకి తెలియకుండానే భయాన్ని పెంచి పోషించడం వలన మొక్కులు చెల్లించకపోతే పాపం అనే భీతి కలుగుతుంది. ఈ కారణంగానే చాలా మంది భగవంతుడికి మొక్కుకున్న తర్వాత దానిని వీలైనంత వేగంగా తీర్చేసే ప్రయత్నం చేస్తారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
Parama Ekadashi : ఏకాదశి ఎంతో విశిష్టమైన రోజుగా భావిస్తాము అయితే ప్రతి నెల ఏకాదశి వస్తుంది కానీ కొన్ని…
This website uses cookies.