Beauty Tips: వేసవికాలంలో బయటకు వెళ్తే ఒక్క సారిగా చర్మం మొత్తం నల్లబడిపోతుంది. ఇలా చర్మం మొత్తం ట్యాన్ కావడంతో అంద విహీనంగా కనిపిస్తూ ఉంటారు. అయితే చర్మం పై ఏర్పడిన ఈ ట్యాన్ తొలగించుకోవడానికి ఖరీదైన రసాయనాలతో కూడిన క్రీమ్స్ ఉపయోగించాల్సిన అవసరం లేకుండా సింపుల్ గా అరటిపండు బంగాళా దుంపతో ట్యాన్ మొత్తం తొలగించుకొని నల్లగా మారిన చర్మాన్ని తెల్లగా చేసుకోవచ్చు. మరి బంగాళాదుంప అరటిపండుతో ఏ విధంగా మన చర్మ సౌందర్యాన్ని రక్షించుకోవచ్చు అనే విషయానికి వస్తే..
చర్మం పై ఏర్పడిన ట్యాన్ తొలగించుకోవడం కోసం ఒక బంగాళాదుంపను పొట్టుతో సహా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. దీనితో పాటు సగం పండిన అరటి పండును తీసుకొని ఈ మిశ్రమంలోకి పాలు కలిపి మెత్తగా తయారు చేసుకోవాలి. ఈ విశ్రమాన్ని మొహం, మెడ అలాగే మోచేతి, మోకాళ్ళ వంటి నల్లగా ఉన్న చర్మ భాగాల పై మాస్క్ లాగా వేసుకోవాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఈ మాస్క్ అలాగే ఉంచుకోవాలి.
ఇలా 20 నిమిషాల తర్వాత ఈ మాస్క్ ను చల్లని నీటితో మసాజ్ చేస్తూ శుభ్రంగా కడుక్కోవాలి. ఇలా వారంలో రెండు సార్లు చేయటం వల్ల చర్మం పై ఏర్పడిన ట్యాన్ మొత్తం తొలగిపోయి నల్లగా మారిన మీ మొహం తెల్లగా మారిపోతుంది. బంగాళదుంప లో ఉండే సహజ పదార్థాలు మన చర్మాన్ని కాంతివంతంగా మార్చడానికి దోహదపడుతుంది. అదేవిధంగా అరటి పండు మన చర్మాన్ని తేమగా ఉంచుతుంది. ఇక పాలలో ఉండే సహజ పదార్థాలు చర్మాన్ని మృదువుగా మార్చడానికి దోహదపడతాయి. ఇలా ఈ మిశ్రమాన్ని మొహానికి మాస్క్ లాగా వేసుకోవటం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారడమే కాకుండా ట్యాన్ మొత్తం తొలగిపోయి తెల్లగా మారుతుంది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.