YSRCP PARTY: గత ఎన్నికల ఓటమి గాయం నుంచి కోలుకోకముందే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి జిల్లాల్లో ఊహించని షాకులు తగులుతున్నాయి. ఒకప్పుడు పార్టీకి పెట్టని కోటలుగా ఉన్న పలు నియోజకవర్గాల్లో ఇప్పుడు వైసీపీ ఉనికి వెతుక్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎన్నికల్లో పరాజయం పాలైన కీలక నేతలు కొందరు రూట్ మార్చి వేరే పార్టీల కండువాలు కప్పేసుకోవడం, మరికొందరు పూర్తిగా సైలెంట్ అయిపోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ క్యాడర్ దిక్కుతోచని స్థితిలో పడిపోయింది. అధిష్టానం ఈ నియోజకవర్గాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టకపోవడంతో, అక్కడ వైఎస్సార్సీపీ దాదాపు ఖాళీ అయ్యే సీన్ కనిపిస్తోందనే చర్చ రాజకీయ వర్గాల్లో జోరందుకుంది.
ముఖ్యంగా కృష్ణా, గుంటూరు, గోదావరి జిల్లాల్లోని కొన్ని కీలక స్థానాల్లో పార్టీ పరిస్థితి దారుణంగా తయారైంది. ఎన్నికల ముగిసిన వెంటనే జగ్గయ్యపేట వంటి చోట్ల బలమైన నేతలు జనసేన గూటికి చేరడంతో అక్కడ వైఎస్సార్సీపీని నడిపించే నాథుడే కరువయ్యాడు. ఇక రాజోలు లాంటి నియోజకవర్గాల్లో ఓటమి తర్వాత ఇన్ఛార్జ్లు లైట్ తీసుకోవడంతో క్షేత్రస్థాయిలో పార్టీ వాయిస్ పూర్తిగా మూగబోయింది. లీడర్ల భవిష్యత్తు ఎలా ఉన్నా, నమ్ముకున్న క్యాడర్ను ఇలా నడిరోడ్డుపై వదిలేయడంపై స్థానిక నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు, పార్టీలోనే ఉంటూ సైలెంట్గా ఉంటున్న సీనియర్ల తీరు జగన్కు పెద్ద తలనొప్పిగా మారింది. ప్రత్తిపాడు, విజయవాడ సెంట్రల్ వంటి నియోజకవర్గాల్లో గతంలో చక్రం తిప్పిన మాజీ మంత్రులు, సీనియర్ మహిళా నేతలు ఇప్పుడు పార్టీ కార్యక్రమాలకు ముఖం చాటేస్తున్నారు. కొందరు సొంత నియోజకవర్గాలను వదిలి పక్క రూట్ చూసుకుంటుంటే, మరికొందరు పార్టీ మారుతారనే ప్రచారం సాగుతున్నా కనీసం ఖండించకుండా మౌన వ్రతం వహిస్తున్నారు. ఈ నలుగురు కీలక నేతల సైలెన్స్ వెనుక అసలు రహస్యం ఏంటా అని క్యాడర్ బుర్రలు బద్దలు కొట్టుకుంటోంది.
ప్రస్తుతం ఈ నియోజకవర్గాల్లో వైసీపీ అనే మాటే వినిపించకుండా పోవడంతో, తక్షణమే అధిష్టానం జోక్యం చేసుకోకపోతే మున్ముందు కోలుకోవడం కష్టమనే సంకేతాలు వస్తున్నాయి. లీడర్లు లేక, ఉన్నవాళ్లు యాక్టివ్గా లేక వెనుకబడిపోతున్న ఈ స్థానాలను జగన్ ఎలా సెట్ చేస్తారు? కొత్త ఇన్ఛార్జ్లను నియమించి పార్టీకి పూర్వవైభవం తెస్తారా లేక ఇలాగే వదిలేస్తారా? అనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.