Health: ప్రస్తుతం సమాజంలో సాంకేతిక ఓ వైపు అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే అంతే స్థాయిలో మనుషుల జీవితాలు, ప్రాణాలతో చెలగాటం ఆడే డ్రగ్స్ కల్చర్ పెరిగిపోతుంది. మనిషి వ్యసనాల మీద వ్యాపారాలు చేసే వారి సంఖ్య కూడా పెరిగిపోయింది. ఓ వైపు సిగరెట్, మద్యం ప్రత్యక్షంగా జరుగుతూ ఉంటే పరోక్షంగా డ్రగ్స్ దందా నడుస్తుంది. ఈ వ్యసనాల కారణంగా సమాజంలో ఎన్ని ఘోరాలు జరుగుతున్న వాటిని కంట్రోల్ చేయడంలో మాత్రం ప్రభుత్వాలు సక్సెస్ కావడం లేదు.
అలాగే ప్రజలు కూడా వ్యసనాల బారి నుంచి బయటపడలేకపోతున్నారు. ముఖ్యంగా సిగరెట్ ఎంత ప్రాణాంతకమో తెలిసి కూడా చాలా మంది దానికి బానిసై క్యాన్సర్, గుండె సంబంధిత రోగాల బారిన పడుతున్నారు. సిగరెట్ వలన జరిగే ఘోరాలపై ఓ వైపు అవగాహన కల్పిస్తున్నా కూడా ప్రజలు వాటి నుంచి దూరం కాలేకపోతున్నారు.
ఈ మధ్యకాలంలో ఆడవాళ్లు కూడా సిగరెట్ తాగడం అలవాటుగా చేసుకున్నారు. సిగరెట్ ని చాలా మంది స్టేటస్ గా ఫీల్ అవుతూ ఉంటారు. ఆ సిగరెట్ ప్రతిక్షణం వాళ్ళ ఆయుష్షు ఎంత తగ్గిస్తుందో తెలుసుకునే ప్రయత్నం చేయరు. ఏదైనా రోగం వచ్చి హాస్పిటల్ లో పడ్డప్పుడు కాని వాస్తవం బోధపడదు. ప్రపంచవ్యాప్తంగా సిగరెట్ ద్వారా పొగాకు తాగేవారి సంఖ్య మిలియన్స్ లో ఉందటే అతిశయోక్తి కాదు.
అదే సమయంలో ఈ సిగరెట్ పొగ కారణంగా ప్రతి సంవత్సరం చనిపోయే వారు, హాస్పిటల్ లో చేరేవారు కూడా అధికంగానే ఉన్నారు. దేశంలో 29 శాతం మంది యువత సిగరెట్ కి బానిసలుగా మారిపోయారని సర్వేలు చెబుతున్నాయి. సిగరెట్ తాగేవారి ఆరోగ్యంతో పాటు వారి కారణంగా చుట్టూ ఉండి ఆ పొగ పీల్చేవారు కూడా అనారోగ్యాల బారిన పడుతున్నారు. పొగాకు తాగే వారు ఎక్కువగా క్యాన్సర్ బారిన పడుతున్నారు.
తరువాత గుండె, ఊపిరితిత్తుల సమస్యలతో సతమతం అయ్యేవారు కూడా ఉన్నారు. ఇదిలా ఒక్క సిగరెట్ త్రాగడం మానేస్తే మన ఆయుష్షులో 30 సెకండ్స్ కాలాన్ని పొడిగించుకోవచ్చని పరిశోధకులు చెబుతున్నారు. సిగరెట్ తాగేవారి తమ ఆయుష్షుని ప్రతి సిగరెట్ పై 30 సెకండ్స్ తగ్గించుకుంటున్నారని దీనిని బట్టి తెలుస్తుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.