News: చాలా మంది ప్రజలు తమ గమ్యానికి చేరుకోవడానికి రైల్వే మార్గాన్ని అనుసరిస్తుంటారు. టికెట్టు కాస్త తక్కువగా ఉండడం, సురక్షితంగా తమ గమ్య స్థానానికి చేరుకునే వెసులుబాటు ఉండటంతో రైల్వే ప్రయాణానికి చాలామంది మొగ్గు చూపుతారు. టిక్కెట్టు ధర తక్కువ గా ఉన్న ప్లాట్ ఫామ్ పై ఏమైనా కొనాలి అంటే సామాన్యుడికి జోబు చిల్లవాల్సిందే. మార్కెట్లో ఉన్న ధరలకు రైల్వే స్టేషన్లలో పలికే ధరలకు అసలు పొంతనే ఉండదు. వాటర్ బాటిల్ లను కూడా ఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతుంటారు. ఇది కొత్త విషయం ఏం కాదు. కానీ ఎవరికో బాగా కాలి ఈ భాగోతాన్ని బహిర్గతం చేశాడు. రైల్వే స్టేషన్లో వాటర్ బాటిల్లపై దోపిడీ అంటూ ఏకంగా ట్విట్టర్లో మోత మోగించాడు. ఈ ట్వీట్ కు అధికారులే కదిలి సదరు వ్యాపారి కి జరిమానా విధించారు. అసలు ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం.
లోక్మాన్య తిలక్ టెర్మినస్ (ఎల్టిటి) టీ స్టాల్ యజమానిపై సెంట్రల్ రైల్వే అధికారులు రూ. 50,000 జరిమానా విధించారు. లీటర్ వాటర్ బాటిల్ కు ఎక్కువ ఛార్జ్ చేస్తున్న వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో సీఆర్ అధికారులు విచారణ ప్రారంభించారు. ఈ నేపథ్యంలో తనిఖీలు నిర్వహించిన అధికారులు వెండర్ ఐడి కార్డు చూపించడంలో స్టాల్ యజమాని విఫలం కావడంతో అతనికి జరిమానా విధించారు.
ఏదైనా ఇష్యూ జరిగితే దానిపై స్పందించడం కాదని, అధికారులు అప్రమత్తంగా ఉండి సామాన్యులను దోచుకునే ఇలాంటి వ్యాపారులపై తగిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుకుంటున్నారు.
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
This website uses cookies.