Entertainment: ఇకపై అన్ని టెలివిజన్ ఛానెల్లు జాతీయ ప్రయోజనాల కోసం ప్రతిరోజూ 30 నిమిషాల పాటు జాతీయ న్యూస్ కంటెంట్ను తమ టీవీ ఛానల్స్లో ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ సూచనను తప్పనిసరిగా పాటించాలని తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, స్పోర్ట్స్, వైల్డ్ లైఫ్ స్టోరీస్ ప్రసారం చేసే ఛానెల్లకు ఈ కొత్త నిబంధన వర్తించదు. విదేశీ ఛానెల్లకు కూడా ఇవి వర్తించవు.ఈ విషయానికి సంబంధించిన సర్కులర్ త్వరలో విడుదల కానుంది.
ప్రజా సేవ ప్రసార సాధనాల ప్రధాన బాధ్యత, ఎయిర్వేవ్లు/ ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీ, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉన్నందున, భారతదేశంలో అన్ని ఛానెల్ లు అప్లింక్ చేయడానికి , డౌన్లింక్ చేయడానికి ఇచ్చిన ఈ మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగిన న్యూస్తో పాటు , సామాజిక అంశాలతో కూడిన న్యూస్ను రోజులో కనీసం 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగిన కంటెంట్ థీమ్లను కూడా మార్గదర్శకాలలో పేర్కొనింది. వీటిలో విద్య& అక్షరాస్యత వ్యాప్తి, వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, సైన్స్ & టెక్నాలజీ, మహిళల సంక్షేమం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం &జాతీయ సమైక్యత వంటి కథనాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు న్యూస్ ఛానెల్లు జాతీయ న్యూస్ను ప్రతి బులిటెన్లో కవర్ చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన మేరకు ఇకపై 30 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో జాతీయ న్యూస్ను కవర్ చేయాల్సి ఉంటుంది.
Eyes: ఇటీవల కాలంలో చిన్న పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఎన్నో రకాల సమస్యలను ఎదుర్కొంటూ ఉంటున్నారు. ముఖ్యంగా…
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
This website uses cookies.