Entertainment: ఇకపై అన్ని టెలివిజన్ ఛానెల్లు జాతీయ ప్రయోజనాల కోసం ప్రతిరోజూ 30 నిమిషాల పాటు జాతీయ న్యూస్ కంటెంట్ను తమ టీవీ ఛానల్స్లో ప్రసారం చేయాల్సి ఉంటుంది. ఈ సూచనను తప్పనిసరిగా పాటించాలని తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటించింది. అయితే, స్పోర్ట్స్, వైల్డ్ లైఫ్ స్టోరీస్ ప్రసారం చేసే ఛానెల్లకు ఈ కొత్త నిబంధన వర్తించదు. విదేశీ ఛానెల్లకు కూడా ఇవి వర్తించవు.ఈ విషయానికి సంబంధించిన సర్కులర్ త్వరలో విడుదల కానుంది.
ప్రజా సేవ ప్రసార సాధనాల ప్రధాన బాధ్యత, ఎయిర్వేవ్లు/ ఫ్రీక్వెన్సీలు పబ్లిక్ ప్రాపర్టీ, సమాజ ప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన అవసరం ఉన్నందున, భారతదేశంలో అన్ని ఛానెల్ లు అప్లింక్ చేయడానికి , డౌన్లింక్ చేయడానికి ఇచ్చిన ఈ మార్గదర్శకాల ప్రకారం జాతీయ ప్రాముఖ్యత కలిగిన న్యూస్తో పాటు , సామాజిక అంశాలతో కూడిన న్యూస్ను రోజులో కనీసం 30 నిమిషాల పాటు ప్రసారం చేయాల్సి ఉంటుంది. జాతీయ స్థాయిలో ఆసక్తి కలిగిన కంటెంట్ థీమ్లను కూడా మార్గదర్శకాలలో పేర్కొనింది. వీటిలో విద్య& అక్షరాస్యత వ్యాప్తి, వ్యవసాయం & గ్రామీణాభివృద్ధి, ఆరోగ్యం & కుటుంబ సంక్షేమం, సైన్స్ & టెక్నాలజీ, మహిళల సంక్షేమం, సమాజంలోని బలహీన వర్గాల సంక్షేమం, పర్యావరణ పరిరక్షణ, సాంస్కృతిక వారసత్వం &జాతీయ సమైక్యత వంటి కథనాలను ప్రసారం చేయాల్సి ఉంటుంది.
ఇప్పటి వరకు తెలుగు రాష్ట్రాల్లో చాలా వరకు న్యూస్ ఛానెల్లు జాతీయ న్యూస్ను ప్రతి బులిటెన్లో కవర్ చేస్తూ వస్తున్నాయి. అయితే తాజాగా భారత ప్రభుత్వ సమాచార మరియు ప్రసార మంత్రిత్వ శాఖ ప్రకటన మేరకు ఇకపై 30 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో జాతీయ న్యూస్ను కవర్ చేయాల్సి ఉంటుంది.
Sai Pallavi: ఫిదా బ్యూటీ సాయి పల్లవికి బాలీవుడ్లో చేదు అనుభవం ఎదురైంది. ఆమె నటించిన మొదటి సినిమా డిజాస్టర్…
RC 17: జూన్ నుంచి రామ్ చరణ్, సుకుమార్ సినిమా మొదలు కాబోతున్నట్టుగా తెలుస్తోంది. ప్రస్తుతం బుచ్చిబాబు దర్శకత్వంలో పెద్ది…
Puranapanda Srinivas: ఎన్నో, ఎన్నెన్నో అమోఘ గ్రంధాలను రచించి, సంకలనీకరించి, ప్రచురించి లక్షల లక్షల లోగిళ్ళలో మంత్రమయ పరిమళాల్ని నిస్వార్ధంగా…
P. Sunil Kumar Reddy:మరో ప్రయోగానికి రెడీ అవుతున్న బోల్డ్ డైరెక్టర్ సునీల్ కుమార్ రెడ్డి. ఏ సినిమా ఇండస్ట్రీలోనైనా…
Ram Charan: మన సౌత్ సినిమాలలో మాత్రమే కాదు, బాలీవుడ్ మూవీస్ లో కూడా స్పెషల్ నంబర్ కి ఉండే…
M.S.Subbulakshmi: సాయి పల్లవి ని రీప్లేస్ చేసిన రుక్మిణి వసంత్? అవును ప్రస్తుతం ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్…
This website uses cookies.