News: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఏపీ రాజకీయాలలో చురుకుగా పావులు కదుపుతూ ప్రజలలోకి వెళ్తున్నాడు. వీలైనంత వరకు, వీలైనన్ని సార్లు ఏదో ఒక అంశం మీద ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజా ఉద్యామాలని చేపడుతున్నారు. పార్టీ క్యాడర్ కూడా బలంగా నియోజకవర్గాలలో ప్రజల మధ్యకి వెళ్లి జనసేనాని ఇచ్చిన పిలుపుతో ప్రజా ఉద్యమాలలో భాగం అవుతున్నారు. ప్రస్తుతం జగనన్న ఇల్లు- ప్రజలందరికి కన్నీళ్లు అంటూ ఒక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. జగనన్న ఇస్తానని హామీ ఇచ్చిన హౌస్ లని పూర్తి చెయ్యలేదని, ఈ హోసింగ్ స్కీంలో పెద్ద అవినీతి జరిగిందని సోషల్ ఆడిట్ చేస్తూ ప్రత్యక్షంగా జనసేన క్యాడర్ ని గ్రౌండ్ లెవల్ లోకి పంపిస్తూ జగనన్న మోసం అనే హ్యాష్ ట్యాగ్ తో క్యాంపైన్ స్టార్ట్ చేశారు.
ఇది ట్విట్టర్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జగనన్న హోసింగ్ ప్రాజెక్ట్స్ లో నిర్మాణాలు ఇంకా మొదలు కాలేదని చూపించడం ద్వారా ప్రభుత్వంపై వ్యతిరేకత పెంచే ప్రయత్నం జనసేనాని చేస్తున్నారు. దీనికి తిప్పి కొట్టడానికి ఈ జగనన్న ఇల్లు స్కీంలో లబ్ది పొందిన వారితో వీడియోలు చేయించే ప్రయత్నం చేస్తున్నారు. అలాగే జనసేన నాయకులు వెళ్లే చోటకి లబ్ధిదారులని పంపిస్తూ గలాటా సృష్టిస్తున్నారు. అలా చేసి కావాలనే జనసేన పార్టీ నేతలు విష ప్రచారం చేస్తున్నారని ప్రజలకి చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. తాజాగా పవన్ కళ్యాణ్ విజయనగరం జిల్లా గుంకలాంలో హోసింగ్ ప్రాజెక్ట్స్ ని సందర్శించి అక్కడ అసంపూర్తిగా ఉన్న నిర్మాణాలని చూశారు. అక్కడే ప్రజలని ఉద్దేశించి ప్రసంగిస్తూ తనకి ఒక్క అవకాశం ఇవ్వాలని, 2024లో జనసేన ప్రభుత్వం ఏర్పాటు చేసే అవకాశం ఇస్తే అభివృద్ధి అంటే ఏంటో చూపిస్తానని హామీ ఇచ్చారు.
ఇప్పటికే ఇప్పటం పర్యటన సందర్భంగా పవన్ కళ్యాణ్ కారు బోనెట్ మీద కూర్చొని ప్రయాణించిన ఘటనపై ఒక కామన్ మెన్ ఫిర్యాదుతో కేసు నమోదు చేశారు. అలాగే రిషికొండలో ఏరియల్ వ్యూ విజువల్స్ తీసుకోవడం నిషేధం విధించారు. దీనికి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ ఏరియల్ విజువల్స్ చిత్రీకరించారు. దీనిపై కూడా కేసు రిజిస్టర్ చేయాలని భావిస్తున్నారు. ఇలా కేసులలో ఇరికించి చట్టపరంగా కూడా జనసేనాని భయపెట్టే ప్రయత్నం చేయాలని వైసీపీ భావిస్తుంది. ఇప్పుడు వైసీపీ వెర్సర్ జనసేనగా ఉన్న ఈ ఏపీలో రాజకీయ పోరు ఎంత వరకు వెళ్తుందనేది చూడాలి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.