Health: ఈ మధ్యకాలంలో ప్రజల దైనందిన జీవితాలలో ప్రోటీని కంటెంట్ ఉన్న ఆహార పదార్ధాలు బాగా తగ్గిపోతున్నాయి. ఫ్యాట్ కంటెంట్ ఎక్కువగా ఉన్న ఫుడ్ తీసుకుంటున్నారు. రోజువారీ లైఫ్ లో టేస్టీకి బాగా అలవాటు పడ్డ ప్రజలు ఈ ఇన్ స్టెంట్ ఫుడ్స్, ఫాస్ట్ ఫుడ్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. ఒకానొక సమయానికి ఈ జంక్ ఫుడ్స్ కి అలవాటు అయిపోతున్నారు. ప్రోటీన్, విటమిన్స్ కంటెంట్ ఉండే ఫుడ్స్ ని బాగా తగ్గించేస్తున్నారు. అలాగే ఒకప్పటి సంప్రదాయ ఆహార పదార్ధాలలో ఈ ప్రోటీన్, విటమిన్స్ ఎక్కువగా ఉండేవి. ఇప్పుడు వాటి వినియోగం క్రమంగా తగ్గిపోతుంది. ఇక ఆ సంప్రదాయ ఆహార పదార్ధాలలో కూడా రకరకాల కెమికల్స్ వేసి నిల్వ ఉంచడం వలన వాటిలో కూడా విటమిన్స్ కంటెంట్ తగ్గిపోతుంది.
ఈ విటమిన్స్ శరీరంలో తగ్గిపోవడం వలన చిన్న వయస్సులోనే చాలా రకాల అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. హాస్పిటల్స్ కి వెళ్లి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. ఇక హాస్పిటల్స్ లో విటమిన్స్ కోసం ప్రత్యేకంగా మెడికల్ సప్లిమెంట్స్ ని డాక్టర్లు రిఫర్ చేస్తున్నారు. అయితే విటమిన్స్ కోసం తీసుకునే మెడికల్ సప్లిమెంట్స్ కారణంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఆఫ్ మిస్సోరీకి చెందిన పరిశోధకులు కొన్ని విటమిన్ సప్లిమెంట్స్ పై ప్రయోగాలు చేశారు. వీటిలో బి3 విటమిన్ సప్లిమెంట్స్ కారణంగా బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని గుర్తించారు. బి3 విటమిన్ సప్లిమెంట్స్ లో ఉండే నికోటినమైడ్ రిబోసైడ్ క్యాన్సర్ కారకాలని ప్రేరేపించి వ్యాధి తీవ్రతని పెంచుతుందని గుర్తించారు.
Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే…
TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
This website uses cookies.