Temple: మన హిందూ సంప్రదాయాల ప్రకారం మనం ఆలయాలకు వెళ్లి మన ఇష్ట దైవారాధనను ఆరాధిస్తూ పూజిస్తూ ఉంటాము. ఇలా తరచూ మనం ఆలయాలకు వెళ్లడం మన సాంప్రదాయంగా కూడా బాధిస్తూ ఉంటాము అయితే ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ చాలా మంది భక్తులు ఎన్నో నియమ నిష్ఠలను పాటిస్తూ భగవంతుడిని ప్రార్థిస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే స్వామివారి ఆలయంలోకి ప్రవేశించడానికి కంటే ముందుగా స్వామివారి గడపకు నమస్కరించి ఆలయంలోకి అడుగు పెడతారు.
ఇలా చాలామంది ముందు స్వామివారి ఆలయ గడపను నమస్కరించి ఆలయంలోకి వెళ్తుంటారు అలా ఎందుకు వెళ్తారో తెలియదు కానీ నమస్కరించి వెళ్తూ ఉంటారు మరి ఎందుకు మనం ఆలయ గడపను నమస్కరించి ఆలయంలోకి అడుగుపెడతాము అనే విషయాన్ని వస్తే.. సాధారణంగా మనం మన ఇంటికి వేసుకునే గడప చెక్కతో తయారు చేసే ఉంటుంది కానీ ఆలయానికి మాత్రం రాతితో గడప తయారు చేసి ఉంటుంది.
రాయి పర్వతానికి చెందినది. భద్రుడు అనే ఋషి భద్రమనే పర్వతంగానూ, హిమవంతుడు అనే భక్తుడు హిమాలయముగానూ, నారాయణుడు అనే భక్తుడు నారాయణాద్రిగానూ అవతరించారని పురాణాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే భక్తుల కోసం భగవంతుడు కొండపైన వెలిశారు. అయితే ఆలయానికి గడప తయారు చేయడానికి ఆ కొండ నుంచి రాయిని తీసుకొస్తారు కనుక సాక్షాత్తు ఆ భద్రుడే ఇక్కడ ఉన్నారని భావించి నమస్కరిస్తూ ఉంటారు అంతేకాకుండా ఆలయం గడప నిత్యం భగవంతుడిని దర్శిస్తూ పుణ్యం చేసుకొని ఉంటుంది కనుక మనం ఆలయ ప్రవేశం చేసే ముందు ఆ గడపకు నమస్కారం చేయడం మంచిదని భావించి చేస్తూ ఉంటారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.