Sivarathri: మహాశివరాత్రి పండుగ దేశవ్యాప్తంగా ప్రతి ఒక్కరు కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు అయితే ఈ పండుగ రోజు చాలామంది శివాలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుంటూ స్వామివారికి అభిషేకాలు అర్చనలు చేస్తూ ఉంటారు అయితే ఈ పండుగ రోజు స్వామి వారిని భక్తి శ్రద్ధలతో పూజించడం వల్ల మీరు అనుకున్న కోరికలన్నీ నెరవేరుతాయి. శివరాత్రి పండుగ రోజు స్వామివారికి అర్చనలు చేయడమే కాకుండా ఉపవాస జాగరణలను ఆచరించడం వల్ల కూడా స్వామివారి ఆశీస్సులు మన పైనే ఉంటాయి.
ఇక స్వామివారికి ఉపవాసం చేసే సమయంలోను జాగరణ చేసే సమయంలోను కొన్ని జాగ్రత్తలను పాటించాలి అలాగే అర్చన చేసే సమయంలో కూడా కాస్త జాగ్రత్తలను పాటించాలి స్వామి వారికి వివిధ రకాల పదార్థాలతో అభిషేకాలు చేస్తూ ఉంటారు అయితే అభిషేకం చేసే సమయంలో పొరపాటున కూడా పసుపు కుంకుమలతో అభిషేకం చేయకూడదు అలాగే తులసి దళాలతో అభిషేకం చేయకూడదు. శివుడికి ఎప్పుడూ కూడా బిల్వదలాలతో అభిషేకం చేయడం మంచిది. ఇక పాలతో అభిషేకం చేయాలనుకునే వారు పాల ప్యాకెట్లతో అభిషేకం చేయకూడదు ఆవుపాలతో అభిషేకం చేయడం మంచిది.
ఇక ఉపవాసం ఉండేవారు ఎలాంటి పరిస్థితులలో కూడా వెల్లుల్లి ఉల్లిపాయతో చేసిన ఆహార పదార్థాలను అసలు ముట్టుకోకూడదు కేవలం పండ్లు స్వామి వారికి నైవేద్యంగా పెట్టినటువంటి ప్రసాదాలను మాత్రమే తినాలి ఇక జాగరణ సమయంలో కూడా శివ చాలీసా చదువుతూ భజనలు చేసుకుంటూ ఆ శివయ్యను స్మరిస్తూ తెల్లవార్లు జాగరణ చేయాలి తప్ప మాటలు పెట్టుకోవడం, ఆటపాటలతో శివరాత్రి జాగరణ చేయకూడదని ఇలాంటి జాగరణ చేసిన ఎలాంటి ఫలితాలు ఉండవని పండితులు చెబుతున్నారు.
Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే…
TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
This website uses cookies.