Hair care: సాధారణంగానే చుండ్రు సమస్యతో బాధపడే వారి సంఖ్య ఈ రోజుల్లో ఎక్కువగానే ఉంటోంది. దానికి తోడు వేసవి సీజన్ ప్రారంభం అవడంతో అధిక ఉష్ణోగ్రతల కారణంగా తలలో చెమట ఎక్కువగా పట్టడం జరుగుతుంది దాంతో ఫంగల్ ఇన్ఫెక్షన్ మరింత ఎక్కువై చుండు సమస్య తీవ్ర రూపం దాలుస్తుంది. కావున చుండ్రు సమస్యకు శాశ్వతంగా చెక్ పెట్టాలంటే కొన్ని ఆయుర్వేద పద్ధతులను పాటించాల్సి ఉంటుంది. ఆ చిట్కాలను తెలుసుకునే ముందు మీరు ప్రతిరోజు ఒక నియమాన్ని పాటించాల్సి ఉంటుంది.
వేడి నీటితో స్నానం చేస్తుంటే వెంటనే మానుకొని గోరువెచ్చని నీటితో స్నానం చేయడం అలవాటు చేసుకోండి. వేడి నీటితో స్నానం చేస్తే చుండ్రు సమస్య మరింత అధికమవుతుంది. వేప నూనె, కొబ్బరి నూనె,ఆలివ్ ఆయిల్ మిశ్రమాన్ని సమపాలల్లో తీసుకొని వేడి చేసి గోరువెచ్చగా ఉన్నప్పుడు తలకు మర్దన చేసుకొని 15 నిమిషాల తర్వాత స్నానం చేస్తే చుండ్రు సమస్యకు పరిష్కారం లభిస్తుంది.
మీకు వీలైతే వేప ఆకులను మెత్తని గుజ్జులా మార్చుకొని తలకు మర్దన చేసుకుంటే వేపాకులో ఉండే యాంటీ ఫంగల్ గుణాలు చుండ్రు సమస్యను తొలగించడంతోపాటు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.యాంటీ బ్యాక్టీరియల్ , ఫంగల్ గుణాలు పుష్కలంగా ఉన్న మెంతులను రాత్రంతా నానబెట్టి మరసటి రోజు మెత్తటి మిశ్రమంగా మార్చి ఈ మిశ్రమాన్ని తల కుదుళ్లకు అంటే విధంగా మర్దన చేసుకుంటే చుండ్రు సమస్య తొలగి వెంట్రుకలు దృఢంగా కాంతివంతంగా తయారవుతాయి. ఇలాంటి చిట్కాలు పాటించడంతో చుండ్రు సమస్య నుంచి బయటపడవచ్చు.
Political: ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను ఒక ఊపు ఊపేసిన టీడీపీ-జనసేన-బీజేపీ కూటమి.. ఇప్పుడు తెలంగాణ వైపు అడుగులు వేస్తోందా? అంటే అవుననే…
TDP PARTY: ఏపీలో రాజ్యసభ ఎన్నికల సైరన్ మోగడంతో పచ్చ చొక్కాల లీడర్లలో కొత్త జోష్ రావాల్సింది పోయి, పాత…
Telangana: తెలంగాణ రాజకీయాల్లో ఒక్కసారిగా వేడి పెరిగింది. గచ్చిబౌలి వేదికగా జనసేన పార్టీ ప్రతిష్టాత్మకంగా ప్లాన్ చేసిన ‘తెలంగాణ నవ…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక ఆసక్తికరమైన ట్రెండ్ నడుస్తోంది. పవర్ ఎటు ఉంటే అటు జంప్ చేయడం ఒక…
TTD: కలియుగ దైవం అయిన శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి తిరుమల తిరుపతిలో నిత్యం బ్రహ్మోత్సవాలు ఎంతో అంగరంగ వైభవంగా…
This website uses cookies.