Tirumala: కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. ఇందులో పండు ముసలి వాళ్ళతో పాటు చిన్న పిల్లల తల్లిదండ్రులు కూడా తిరుమలకు చేరుకుంటూ ఉంటారు. ఇప్పటికే 60 సంవత్సరాలు దాటిన సీనియర్ సిటిజన్ లకు ప్రత్యేక దర్శనాలను కల్పిస్తున్న సంగతి తెలిసిందే. అయితే చిన్నపిల్లలతో తిరుమల వెళ్లే భక్తులకు ఎన్నో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే టీటీడీ మరో కీలక నిర్ణయాన్ని తీసుకుంది.
ఈ నేపథ్యంలోనే ఏడాదిలోపు వయసు ఉన్నటువంటి పిల్లలతో కలిసి తిరుమల వెళ్తున్న తల్లిదండ్రులు సుపదం ఎంట్రెన్స్ ద్వారా ఉచిత ప్రవేశ దర్శనాలను కల్పిస్తోంది. ఈ ప్రత్యేక దర్శనం ద్వారా సుమారు ఒక గంట నుంచి గంటన్నర వ్యవధిలోనే దర్శనం పూర్తి అయ్యే అవకాశం ఉంటుంది. మరి ఈ దర్శనం కోసం ఎలా అప్లై చేసుకోవాలి ఏ విధమైనటువంటి నిబంధనలు ఉంటాయనే విషయానికి వస్తే.. సుపదం ఎంట్రన్స్ ద్వారా స్వామివారి దర్శనం చేసుకోవాలనుకునే వారు తమ బిడ్డ వయసుకు సంబంధించి భర్త సర్టిఫికెట్ తో పాటు తల్లిదండ్రుల ఆధార్ కార్డు కూడా వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది.
ఇలా ఈ డాక్యుమెంట్స్ తో తిరుమలలోని సుపదం ఎంట్రన్స్ వద్దకు వెళ్లాలి. ఈ దర్శనం కోసం ఎలాంటి టికెట్లు అవసరం లేదు. దర్శన సమయం మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఉంటుంది. ఈ పథకం ద్వారా ఏడాదిలోపు వయసున్న చిన్నారులు తల్లితండ్రులు ఉచితంగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అయితే ఈ దర్శనానికి వెళ్లేవారు పిల్లలకు సంబంధించిన కొన్ని వస్తువులను వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుందని టీటీడీ తెలిపింది. చిన్నారులకు అవసరమైన పాలు నీళ్లు డైపర్లు వెంట తీసుకెళ్లాలి అదేవిధంగా చిన్నారులకు అవసరమైన మెడిసిన్ కూడా తల్లిదండ్రులు వెంట తీసుకువెళ్లాల్సి ఉంటుంది. అదేవిధంగా చిన్నారి తల్లిదండ్రుల ఆధార్ కార్డులతో పాటు చిన్నారి బర్త్డే సర్టిఫికెట్ కి సంబంధించిన ఒరిజినల్ డాక్యుమెంట్స్ కూడా వెంట తీసుకువెళ్లాలి. భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్న రోజులలో దర్శనం కోసం ఒక అరగంట అదనపు సమయం పడుతుందని అధికారులు తెలిపారు.
Liver Health: మనం ఎంత ఆరోగ్యంగా ఉన్నాము అనే విషయాలను మన శరీర లక్షణాలను బట్టి అంచనా వేయవచ్చు. మన…
Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు టిటిడి అధికారులు కీలక సూచనలను జారీ చేశారు. మరి కొద్ది రోజులలో శ్రీవారి వార్షిక…
Drinking water: నీరు తాగడం మన ఆరోగ్యానికి ఎంతో శ్రేయస్కరమనే విషయం తెలిసిందే. ప్రతిరోజు దాదాపు 7 నుంచి 8…
Tholi Ekadashi 2026: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం ఏకాదశికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆషాడ మాసంలో వచ్చే…
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
This website uses cookies.