Health Tips: వర్షాకాలం మొదలవడంతో తరచూ వానలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా వర్షాకాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు తొందరగా వస్తూ ఉంటాయి. అయితే ఈ దగ్గు జలుబు సమస్య అనేది ఎన్ని మందులు వాడిన తగ్గదు. అయితే మందులు ఉపయోగించిన దగ్గు జలుబు తగ్గలేదు అంటే మన ఈ చిట్కాలను కనుక పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు.
మరి వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయానికి వస్తే.. ముందుగా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకోవాలి.
వీటితో పాటు రెండు లెమన్ స్లైసెస్ వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనెను కలిపి గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందగలము తద్వారా శ్వాస తీసుకోవడానికి కూడా తేలికగా అవుతుంది. వెల్లుల్లి తేనే నిమ్మకాయలు ఎన్నో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి కనుక ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.