Health Tips: వర్షాకాలం మొదలవడంతో తరచూ వానలు పడుతూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఎన్నో రకాల సమస్యలు కూడా మనల్ని వెంటాడుతూ ఉంటాయి ముఖ్యంగా వర్షాకాలంలో దగ్గు జలుబు వంటి సమస్యలు తొందరగా వస్తూ ఉంటాయి. అయితే ఈ దగ్గు జలుబు సమస్య అనేది ఎన్ని మందులు వాడిన తగ్గదు. అయితే మందులు ఉపయోగించిన దగ్గు జలుబు తగ్గలేదు అంటే మన ఈ చిట్కాలను కనుక పాటిస్తే వెంటనే ఉపశమనం పొందవచ్చు.
మరి వర్షాకాలంలో వచ్చే దగ్గు జలుబు సమస్య నుంచి ఉపశమనం పొందాలి అంటే ఎలాంటి చిట్కాలను పాటించాలి అనే విషయానికి వస్తే.. ముందుగా మూడు వెల్లుల్లి రెబ్బలను తీసుకొని పొట్టు తీయకుండా కచ్చాపచ్చాగా దంచి పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టుకుని అందులో ఒక గ్లాస్ వాటర్ పోసుకోవాలి. వాటర్ హీట్ అయ్యాక దంచి పెట్టుకున్న వెల్లుల్లి రెబ్బలను అందులో వేసుకోవాలి.
వీటితో పాటు రెండు లెమన్ స్లైసెస్ వేసుకొని 10 నుంచి 12 నిమిషాల పాటు మరిగించాలి. ఆ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మరిగించిన వాటర్ ను ఫిల్టర్ చేసుకోవాలి. ఈ వాటర్ లో వన్ టేబుల్ స్పూన్ స్వచ్ఛమైన తేనెను కలిపి గోరువెచ్చగా ఉన్న సమయంలో తాగటం వల్ల దగ్గు జలుబు వంటి సమస్య నుంచి తొందరగా ఉపశమనం పొందగలము తద్వారా శ్వాస తీసుకోవడానికి కూడా తేలికగా అవుతుంది. వెల్లుల్లి తేనే నిమ్మకాయలు ఎన్నో యాంటీబయోటిక్ గుణాలు ఉంటాయి కనుక ఇవి ఇన్ఫెక్షన్లను తగ్గించడానికి ఎంతగానో దోహదం చేస్తాయి.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.