Mosquito Bite: వర్షాకాలం మొదలవడంతో దోమలు కూడా అధికమవుతున్నాయి. ఇలా దోమలు అధికమైతే కనుక కచ్చితంగా మలేరియా, డెంగ్యూ వంటి ప్రమాదకర రోగాలు కూడా వస్తుంటాయి. ఇలా ఈ ప్రమాదకరమైన జబ్బుల బారిన పడితే కొన్నిసార్లు మరణాలు కూడా సంభవిస్తున్న సంగతి తెలిసిందే. అందుకే దోమ కాటుకు గురి కాకుండా ఉండడం కోసం తగినన్ని జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఇకపోతే చాలామందిలో దోమలు కుట్టిన తర్వాత ఒక రకమైన దురదతో పాటు చిన్నపాటి దద్దుర్లు కూడా ఏర్పడుతూ ఉంటాయి. దోమ కాటు వల్ల వచ్చే దురద కారణంగా చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు.
ఇలా దోమ కాటు వల్ల ఏర్పడే దద్దుర్లు, మంట వాపును తగ్గించడం కోసం అరటిపండు, గ్లిజరిన్ కీలకపాత్ర పోషిస్తుందని చెప్పాలి. అరటిపండులో మాత్రమే కాకుండా తొక్కలో ఎన్నో పోషక విలువలు దాగి ఉన్నాయి.అరటిపండు తొక్కలో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉండుట వలన దోమ కాటు కారణంగా వచ్చే దద్దుర్ల,మంటను తగ్గిస్తాయి. అదేవిధంగా గ్లిజరిన్ కూడా దోమ కాటు వల్ల వచ్చే వాపు మంటను తగ్గిస్తుంది. అరటిపండు తొక్కలో సగ భాగాన్ని తీసుకోని దానిలో కొంచెం గ్లిజరిన్ వేసి మెత్తని పేస్ట్ గా తయారుచేయాలి.
ఈ పేస్ట్ ని దోమ కుట్టిన ప్రదేశంలో రాసి 5 నిమిషాల పాటు దోమ కుట్టిన ప్రదేశంలో మర్దన చేసి ఒక అరగంట తర్వాత చల్లని నీటితో శుభ్రం చేయాలి. ఇలా చేయడం వల్ల దోమ కాటు వల్ల వచ్చే వాపు , మంటను తగ్గిస్తుంది. ఇక వర్షాకాలంలో పెద్ద ఎత్తున దోమలు ఇంట్లోనే వృద్ధి చెందుతూ ఉంటాయి. అందుకే దోమల వ్యాప్తిని అరికట్టడానికి వీలైనంతగా కృషి చేయాలి. దోమలు పెరగకుండా ఉండడం కోసం ఇంట్లో పూల కుండీలలో నీరు నిలవకుండా చూసుకోవాలి. ఇంటి పరిసర ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇక రాత్రి పడుకునే సమయంలో దోమతెరలను వాడటం ఎంతో మంచిది. ఇక ఇంట్లో దోమలు కుట్టకుండా మస్కిటో కాయిల్స్ వంటి వాటితో దోమలను అరికట్టవచ్చు.
Srivari Mudupu: భక్తులు కోరిన కోరికలు తీర్చే శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం లక్షలాదిమంది భక్తులు తిరుమల చేరుకుంటారు. ఎంతో భక్తి…
Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి సోషియో ఫాంటసీ అడ్వెంచర్ 'విశ్వంభర' కోసం అభిమానులు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. షూటింగ్ మొదలై…
Smart Phone: ఇటీవల కాలంలో స్మార్ట్ ఫోన్ వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు…
Tirumala Laddu: కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం నిత్యం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. మన భారతదేశంలో…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వంగవీటి అనే పేరుకు ఉన్న వైబ్రేషన్స్ వేరు. రంగా మరణించి దశాబ్దాలు గడుస్తున్నా.. కోస్తా…
Tirumala: కలియుగ దైవమైన తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం కోసం ఎంతోమంది భక్తులు తరలివస్తుంటారు. ఇందులో పండు ముసలి వాళ్ళతో పాటు…
This website uses cookies.