Garuda Puranam: సాధారణంగా ఒక వ్యక్తి జన్మించిన తర్వాత మరణం అనేది తప్పదు. అది ఎప్పుడు సంభవిస్తుంది అనే విషయం మనకు తెలియదు కానీ మరణం అనేది మాత్రం తప్పనిసరి అని అందరికీ తెలిసిన విషయమే అయితే చాలామంది మరణం సంభవిస్తుంది అంటే వారిలో ఏదో ఒక రకమైన భయం అనేది కలుగుతుంది. మనం ఎప్పుడైనా చనిపోయే వాళ్ళం అని తెలిసినప్పటికీ ఈ భయం మాత్రం అందరిని బాగా కృంగదీస్తుంది. అయితే మనం మరణించే కొన్ని రోజుల ముందు మనలో కొన్ని లక్షణాలు కనుక కనబడుతున్నారు అంటే మనకు మరణం సంభవించినట్లేనని అర్థం.
గరుడ పురాణం ప్రకారం మరణానికి ముందు కనిపించే లక్షణాలను గురించి అర్థవంతంగా వివరించబడింది మరి మరణం సంభవించే ముందు మనకు ఎలాంటి లక్షణాలు ఉంటాయనే విషయానికి వస్తే మనం నీటిలో కానీ నూనెలో కానీ లేదా అద్దంలో కానీ మనం మొహం చూసుకుంటున్నప్పుడు స్పష్టంగా కనిపించదు. ఇక అద్దంలో మన మొహం సరిగా కనిపించకపోతే మనకు త్వరలోనే మరణం రాబోతుందని సంకేతం. నలుగురిలో ఉన్నప్పుడు మనం వారు మాట్లాడే మాటలను సరిగా గుర్తించలేము అలాగే మన నోటి వెంట మాటలు కూడా సరిగా రాకపోతే మనకు త్వరలోనే మరణం తత్యము అని గరుడ పురాణం చెబుతుంది.
ఇక ఎవరికైతే మరణం త్వరలోనే సంభవిస్తుందో అలాంటి వారికి కలలో పూర్వీకులు కనపడి బాధతో ఏడుస్తూ ఉంటారు ఇలా బాధపడుతూ ఏడుస్తూ ఉన్నట్లయితే త్వరలోనే మనకు కూడా మరణం సంభవిస్తుందని అర్థం. అదేవిధంగా మనం మరణించే ముందు మన నోటి వెంట కూడా ఇక నేను ఉండను నేను రాలేను అంటూ కొన్ని పదాలు మనకు తెలియకుండానే వస్తుంటాయి ఇలాంటి పదాలు మాట్లాడుతున్నాము అంటే మరణం అంచుల్లో ఉన్నామని సంకేతం.