Chandrababu:ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల లక్ష్యంగా చేసుకొని ఎప్పటికప్పుడు దాడులకు భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగపడటం తరచుగా జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. మంచి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ముందుగా నల్ల బెలూన్లతో చంద్రబాబు పర్యటనకు నిరసనగా ఆందోళనలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ఏకంగా రోడ్డుపై షర్టు విప్పి మరీ చంద్రబాబుకు సవాలు విసిరారు.
ఇదిలా ఉంటే మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ముందు చంద్రబాబు కాన్వాయ్ వెళుతూ ఉన్న సమయంలోనే వైసిపి కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం జరిగింది. అయితే చంద్రబాబుకు రాళ్ల దెబ్బలు తగలకుండా ఎన్.ఎస్.జి సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అడ్డుపెట్టి నివారించారు. మంత్రి సురేష్ సారధ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. పట్టణంలో చంద్రబాబు సభ నిర్వహించాల్సి ఉండగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేసి అంతరాయం కలిగించినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.
ప్రతిపక్షాలు లేకుండా చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ దాడులను చూస్తుంటే తెలుస్తుందని అన్నారు. ఇలాంటి దాడులతో ప్రశ్నించే ప్రతిపక్షాల నొక్కేయలిని ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అంటూ విమర్శించారు. ఇక చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ఒక ఎన్ఎస్జి సిబ్బందికి గాయాలు అయ్యాయి. అతని హాస్పిటలకు తరలించి చికిత్స అందించారు. తర్వాత చంద్రబాబు అతనిని పరామర్శించారు. ఈ ఘటంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాలి.
Mega 158: దుబాయ్లో మెగా 158..చిరు ఆ పనుల్లో ఫుల్ బిజీ! అంటూ ఇప్పుడు సోషల్ మీడియాలో లేటెస్ట్ న్యూస్…
Allu Arjun: మన శంకరవరప్రసాద్గారు సంక్రాంతి బాస్ బస్టర్..అంటూ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తాజాగా సోషల్ మీడియాలో పెట్టిన…
Tollywood: టాలీవుడ్లో ఈ సంక్రాంతికి రిలీజైన సినిమాల అసలైన పరీక్ష మొదలవబోతోంది. మొత్తం 5 సినిమాలు ఈ సంక్రాంతికి బరిలో…
MSG: మెగాస్టార్ దెబ్బ.. కొడితే బాక్సులు బద్ధలైయ్యాయి బాసు! అవును ఇప్పుడు మెగా ఫ్యాన్స్ ఇదే మాట చెప్పుకుంటూ సంబరాలు…
Ashika Ranganath: ఆషిక రంగనాథ్ టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిందా? ప్రస్తుతం తన కెరీర్ చూస్తుంటే అలాగే…
Peddi: పెద్ది ఓటీటీ పార్ట్నర్ ఫిక్సైంది. మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రూపొందుతున్న రా అండ్ రస్ట్రిక్ మూవీ…
This website uses cookies.