Virupaksha : మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ గత ఏడాది భారీ యాక్సిడెంట్ అయి పెద్ద ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఈ యాక్సిడెంట్ తర్వాత సాయి తేజ్ నటించిన మొదటి సినిమా విరూపాక్ష. ఈ సినిమా షూటింగ్ సమయంలో డైలాగులు చెప్పలేక చాలా ఇబ్బందులు పడ్డాడు సాయి తేజ్. అయినా మెగా హీరోలకి పట్టుదల ఎక్కువ. ఏదన్నా అనుకుంటే అది సాధించే వరకూ నిద్రపోరు. ఈ మెగా మేనల్లుడు కూడా అంతే.
విరూపాక్ష సినిమా కోసం చాలా శ్రమించాడు. దీనికి కారణం ఇది ఒకరకంగా సాయి తేజ్ కి పునర్జన్మ కావడమే. ఇంకోటి కథ. ఇలాంటి కథను గతంలో ఈ మెగా హీరో టచ్ చేయలేదు. అన్నీ రకాలుగా ఈ సినిమా సాయి తేజ్ కి పెద్ద ఛాలెంజ్. అందుకే పెద్ద రిస్క్ చేసి ఫైనల్గా సూపర్ హిట్ కొట్టేశాడు. ఈ వారం బాక్సాఫీస్ వద్ద విడుదలైన సమయం నుంచి పాజిటివ్ టాక్ తో ప్రదర్శింపబడుతోంది.
మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు విరూపాక్ష సినిమా చూసిన ప్రేక్షకులందరూ సూపర్ హిట్ అని తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ కథాంశం కావడంతో ప్రేక్షకులు కుర్చీల్లో నుంచి లేవనివ్వకుండా సినిమా చివరి థ్రిల్ ని ఎంజాయ్ చేస్తున్నారు. వాస్తవంగా చెప్పాలంటే విరూపాక్ష సినిమాపై అంతగా అంచనాలు లేవనే చెప్పాలి. కానీ, వారి ఆలోచనను తలకిందులు చేస్తూ ఈ సినిమా సాయి ధరమ్ తేజ్ కెరీర్లో ఓ మైల్ స్టోన్ లాంటి సినిమాగా నిలిచింది. ప్రస్తుతం సాయి ధరమ్ తేజ్ ఈ సినిమా సక్సెస్ను బాగా ఎంజాయ్ చేస్తున్నారు.
ఇక విరూపాక్ష సక్సెస్ క్రెడిట్ కొంత దర్శకుడు సుకుమార్ ఖాతాలోకి వెళుతుంది. అలాగే లక్కీ హీరోయిన్ అని చెప్పుకుంటున్న సంయుక్త మేనన్ కి దక్కింది. సుకుమార్ శిష్యుడు కార్తీక్ దండు ఈ సినిమాతో టాలీవుడ్కి దర్శకుడిగా పరిచయం అయ్యాడు. మొదటి సినిమాతో తనేంటో నిరూపించుకొని బాగానే గుర్తింపు సంపాదించుకున్నాడు.
Tirumala: తిరుమల శ్రీవారి దర్శనం కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవులు పూర్తి కావడంతో భక్తుల రద్దీ…
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
This website uses cookies.