Chandrababu:ఏపీలో అధికార పార్టీ వైసీపీ ప్రతిపక్షాల లక్ష్యంగా చేసుకొని ఎప్పటికప్పుడు దాడులకు భయబ్రాంతులకు గురి చేసే ప్రయత్నం చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబును అడ్డుకోవడమే లక్ష్యంగా వైసీపీ శ్రేణులు దాడులకు తెగపడటం తరచుగా జరుగుతూనే ఉంది. తాజాగా మరోసారి ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెంలో చంద్రబాబును లక్ష్యంగా చేసుకుని వైసిపి కార్యకర్తలు రెచ్చిపోయారు. మంచి ఆదిమూలపు సురేష్ ఆధ్వర్యంలో ముందుగా నల్ల బెలూన్లతో చంద్రబాబు పర్యటనకు నిరసనగా ఆందోళనలు చేశారు. చంద్రబాబు గో బ్యాక్ అంటూ నినాదాలు చేశారు. మంత్రి ఆదిమూలపు సురేష్ అయితే ఏకంగా రోడ్డుపై షర్టు విప్పి మరీ చంద్రబాబుకు సవాలు విసిరారు.
ఇదిలా ఉంటే మంత్రి ఆదిమూలపు సురేష్ కార్యాలయం ముందు చంద్రబాబు కాన్వాయ్ వెళుతూ ఉన్న సమయంలోనే వైసిపి కార్యకర్తలు రాళ్ళ దాడికి పాల్పడటం జరిగింది. అయితే చంద్రబాబుకు రాళ్ల దెబ్బలు తగలకుండా ఎన్.ఎస్.జి సిబ్బంది బుల్లెట్ ప్రూఫ్ జాకెట్స్ అడ్డుపెట్టి నివారించారు. మంత్రి సురేష్ సారధ్యంలోనే ఈ దాడి జరిగినట్లుగా చంద్రబాబు ఆరోపణలు చేస్తున్నారు. పట్టణంలో చంద్రబాబు సభ నిర్వహించాల్సి ఉండగా విద్యుత్ సరఫరా కూడా నిలిపేసి అంతరాయం కలిగించినట్లుగా తెలుస్తుంది. చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడిని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా ఖండించారు.
ప్రతిపక్షాలు లేకుండా చేయడమే జగన్ లక్ష్యంగా పెట్టుకున్నట్లుగా ఈ దాడులను చూస్తుంటే తెలుస్తుందని అన్నారు. ఇలాంటి దాడులతో ప్రశ్నించే ప్రతిపక్షాల నొక్కేయలిని ప్రయత్నం చేయడం ప్రజాస్వామ్యం విలువలకు తిలోదకాలు ఇవ్వడమే అంటూ విమర్శించారు. ఇక చంద్రబాబుపై జరిగిన రాళ్ల దాడి ఘటనలో ఒక ఎన్ఎస్జి సిబ్బందికి గాయాలు అయ్యాయి. అతని హాస్పిటలకు తరలించి చికిత్స అందించారు. తర్వాత చంద్రబాబు అతనిని పరామర్శించారు. ఈ ఘటంపై వైసీపీ నేతల వ్యాఖ్యలు ఏ విధంగా ఉంటాయి అనేది వేచి చూడాలి.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.