YSRCP: ఏపీలో అధికార పార్టీ వైసిపి వచ్చే ఎన్నికలే లక్ష్యంగా తమ రాజకీయ ప్రచార కార్యక్రమాలను ఇప్పటికే మొదలు పెట్టింది. వివిధ మార్గాల ద్వారా విస్తృతంగా ఎమ్మెల్యేలను, నాయకులను ప్రజల్లోకి పంపించి విస్తృతంగా సంక్షేమ పథకాలతో ప్రచారం నిర్వహిస్తూ ఉన్నారు. అలాగే టార్గెట్ 175 అంటూ ముఖ్యమంత్రి జగన్ లక్ష్యంగా పెట్టుకుని నాయకులకి దిశా నిర్దేశం చేస్తూ రాజకీయ వ్యూహాలతో కార్యాచరణలు సిద్ధం చేస్తున్నారు. సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికలలో తమను అధికారంలోకి తీసుకువస్తాయని ముఖ్యమంత్రి జగన్ అంచనా వేస్తున్నారు.
ప్రతి ఇంట్లో మహిళలు ఏదో ఒక విధంగా సంక్షేమ పథకాలతో లబ్ధి పొందుతూ ఉండడం అధికార పార్టీ వైసీపీకి సానుకూలమైన అంశంగా ఉంది. డబ్బులు తీసుకుంటున్న మహిళలు కచ్చితంగా కృతజ్ఞత చూపిస్తారని జగన్ అంచనా వేస్తున్నారు. ఇదిలా ఉంటే పొలిటికల్ సర్వే సంస్థలు, మీడియా సంస్థలు ఎప్పటికప్పుడు దేశంలోని రాష్ట్రంలోని రాజకీయ వాతావరణాన్ని అంచనా వేసే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఈ నేపథ్యంలో తాజాగా జాతీయస్థాయిలో ఓ ఛానల్ నిర్వహించిన సర్వేలు ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే వైసిపి అధికారంలోకి వస్తుందని అంచనా వేశారు.
ముఖ్యంగా ఏపీలో లోక్ సభ స్థానాలలో 25కి 24 వైయస్సార్సీపి గెలుచుకుంటుందని చెప్పడం విశేషం. ఇక ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ ఒకటి రెండు స్థానాలలో మాత్రమే ఎంపీ అభ్యర్థులను గెలిపించుకునే ఛాన్స్ ఉందని సదరు సర్వేలో పేర్కొన్నారు. అలాగే దేశంలో మరల బిజెపి అధికారంలోకి వస్తుందని భారీ మెజారిటీతో లోక్ సభ స్థానాలను గెలుచుకుంటుంది అని సదరు సర్వేలో చెప్పడం విశేషం. ఇక కాంగ్రెస్ పార్టీ అయితే 104 లోక్ సభ స్థానాల వరకు గెలుచుకునే ఛాన్స్ ఉందని అంచనా వేశారు.
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో గుడివాడ నియోజకవర్గానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. గత రెండు దశాబ్దాలుగా అక్కడ వినిపించే…
Andhra Pradesh: కర్నూలు జిల్లా రాజకీయం ఎప్పుడూ హాట్ హాట్గానే ఉంటుంది. కానీ, ఇటీవలి కాలంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ…
TDP PARTY: తెలుగుదేశం పార్టీ అధినేత, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పొలిటికల్ స్టైల్ పూర్తిగా మారిపోయింది. ఒకప్పుడు తప్పు…
TVK PARTY: తమిళనాడు రాజకీయాల్లో సరికొత్త సంచలనం నమోదైంది. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి తనదైన శైలిలో నిర్ణయాలు…
Mega 158: ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి నటించబోతున్న మెగా…
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
This website uses cookies.