Spirtual: ప్రతినెలలో అమావాస్య తిథి వస్తుంది. ప్రతి అమావాస్యకి ఒక ప్రత్యేకత ఉంటుంది. హిందూ పురాణాల ప్రకారం అమావాస్య, పౌర్ణమి అనేవి ఎంతో విశేషం కలిగి ఉన్న రోజులు. ఆయా రోజులలో దేవతారాధన ఉంటుంది. వీటిని cవిశేషంగా నమ్ముతారు. ఇప్పటికి చాలా మంది ఆచరిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో వీటిని నమ్మేవారి సంఖ్య ఇంకా ఎక్కువ పెరిగింది. అలాగే ప్రత్యేక తిథులలో పూజలు, వ్రతాలు ఆచరించడం కూడా చేస్తున్నారు.
సనాతన ధర్మంలో ఈ ఆచార వ్యవహారాలకి ప్రత్యేక విశేషం ఉంటుంది. వీటిని చాలా నియమ నిష్ఠలతో చేయాలి. ఇలా చేయడం వలన గత జన్మల కర్మల నుంచి విముక్తి లభించడంతో పాటు ఈ జన్మలో తెలిసి, తెలియక చేసిన పాపకర్మల నుంచి కూడా విముక్తి లభిస్తుందని, అలాగే కోరిన కోరికలు నెరవేరుతాయని చాలా మంది విశ్వసిస్తూ ఉంటారు. అలాగే కొన్ని అరుదైన సందర్భాలు కూడా ఉంటాయి.
అలా ఈ నెల 30న వచ్చే అమావాస్యకి ప్రత్యేకత ఉంది. దీనిని సోమవతి అమావాస్య అని అంటారు. ఈ అమావాస్య చాలా అరుదుగా వస్తుందని చెబుతున్నారు. ఈ రోజునే శని జయంతి, వట సావిత్రి వ్రతం కూడా రావడం ప్రత్యేకంగా చెప్పుకోవాలి. సుమారు 30 ఏళ్ల తర్వాత ఒకే రోజున మూడు పండుగలు రావడం ప్రత్యేకత అని చెప్పాలి. ఈ రోజున పరమశివుడిని ప్రత్యేకముగా పూజిస్తే శివానుగ్రహం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. అలాగే ఈ రోజున మన పూర్వీకులని స్మరించుకుంటూ సామర్ధ్యం కొద్ది దానధర్మాలు చేస్తే మంచి ఫలితాలు వస్తాయని చెబుతున్నారు.
అలాగే లక్ష్మీదేవి పూజ చేస్తే ఆర్ధిక సమస్యలు కూడా తొలగిపోతాయని అంటున్నారు. అలాగే ఈ రోజున రావిచెట్టుకి స్త్రీలు పూజలు చేసి, ప్రదక్షిణాలు చేస్తే ఎంతో శుభ ఫలితాలు పొందవచ్చని కూడా చెబుతున్నారు. అయితే నిష్ఠతో ఈ రోజులు పూజలు చేయడం ఎంత ముఖ్యమో అలాగే కొన్ని పనులకి దూరంగా ఉండటం కూడా మంచిదని పండితులు చెబుతున్నారు. సోమవతి అమావాస్య రోజున మద్యం, మాంసం జోలికి వెళ్ళకూడదు. అలాగే జుట్టు, గోళ్లు కత్తిరించకూడదు. రావిచెట్టుని పూజించే సమయంలో పొరపాటున కూడా చెట్టుని తాకకూడదు. అలాగే ఎవ్వరినీ దూషించకూడదు. ఇలా చెడుపనులు చేస్తే దుష్ఫలితాలు సంభవించే అవకాశం ఉందని పండితులు చెబుతున్నారు.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.