Mahalaya Paksham:భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షముగా పిలుస్తారు. ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై.. అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించుకోవడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మహాలయపక్షంలో ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి.. పితృ దేవతలను సర్మించుకోవాలి.తద్వారా ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక పితృదేవతలకు పిండ ప్రధానలు చేయడానికి మహాలయ పక్షం ఎంతో శుభమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుదరి పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం మంచిది.
ఇలా ఈ మహాలయ పక్షంలో మరణించిన మన పెద్దవారిని స్మరించుకొని వారికి తర్పణాలు చేయటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే వారి ఆశీస్సులు కూడా మనపై ఉండి మనపై ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 15 రోజులు ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో మంచిది.
AP NEWS: ప్రకాశం జిల్లా రాజకీయాలు ఎప్పుడూ హాట్ టాపిక్కే. అయితే, 2024 ఎన్నికల ఫలితాల తర్వాత అక్కడ సమీకరణాలు…
Chandrababu: రాయలసీమ రత్నాల గర్భ అనే మాటను మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం. కానీ, ఇప్పుడు ఆ మాట…
Tollywood: సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమా వస్తుందంటేనే టాలీవుడ్లో ఆ సందడి వేరేలా ఉంటుంది. అలాంటిది ఆయన ఒకే…
Jamun Fruits: వేసవికాలం అంటే అందరికీ టక్కున మామిడి పండ్లు గుర్తుకొస్తాయి. ఇక వేసవిలో లభించే పండ్లలో మామిడి పండ్ల…
AP NEWS: విశాఖపట్నంలో ల్యాండ్ మాఫియా ఏ స్థాయిలో వేళ్లునునుకుపోయిందో చెప్పడానికి తాజా ఘటనే నిదర్శనం. సామాన్యుల ప్లాట్లను టార్గెట్…
Jyeshtha Pournami: ప్రతినెల మనకు ఒక పౌర్ణమి వస్తుంది. ఇలా ఏడాదిలో ప్రతి నెల పౌర్ణమిని జరుపుకుంటారు. అయితే జేష్ఠ్య…
This website uses cookies.