Mahalaya Paksham:భాద్రపదమాసంలో శుక్లపక్షంలో వినాయక చవితి పర్వదినాన్ని జరుపుకుంటాం. ఇక బహుళపక్షంలో కృష్ణపక్షం పితృకార్యాలకు విశేషం. భాద్రపద బహుళ పాడ్యమి నుంచి భాద్రపద అమావాస్య వరకు ఉన్న రోజులను మహాలయ పక్షముగా పిలుస్తారు. ఏడాదికి 12 అమావాస్యలుంటాయి. కానీ, భాద్రపద అమావాస్యకు ఎంతో విశిష్ఠత ఉన్నది. ఈ ఏడాది ఈ నెల 18 నుంచి మహాలయ పక్షాలు ప్రారంభమై.. అక్టోబర్ 2వ తేదీతో ముగియనున్నాయి. ఈ మహాలయ పక్షంలో పితృదేవతలను స్మరించుకోవడం వల్ల పితృ దోషాలు తొలగిపోతాయని పండితులు చెబుతున్నారు.
ఈ మహాలయపక్షంలో ప్రతిరోజు ఉదయం ఇంటి ప్రధాన ద్వారం ఎదుట లోపల నిలబడి చేతులను జోడించి.. పితృ దేవతలను సర్మించుకోవాలి.తద్వారా ఆయుః ఆరోగ్యం, ఐశ్వర్యాలు సిద్ధిస్తాయని పురాణాలు చెబుతున్నాయి. ఇక పితృదేవతలకు పిండ ప్రధానలు చేయడానికి మహాలయ పక్షం ఎంతో శుభమైనదని పండితులు చెబుతున్నారు. ఈ పక్షం రోజుల్లో పితృదేవతలకు తర్పణ, శ్రాద్ధ విధులను తప్పనిసరిగా శాస్త్రోక్తంగా నిర్వహించారు. కుదరి పక్షంలో తమ పితృదేవతలు ఏ తిథిరోజైతే కన్నుమూశారో ఈ పక్షంలో వచ్చే అదే తిథినాడు శ్రాద్ధం నిర్వర్తించాలి. ఒకవేళ తిథి రోజున వీలు కాకపోయినా అమావాస్య రోజున పిండ ప్రధానాలు చేయడం మంచిది.
ఇలా ఈ మహాలయ పక్షంలో మరణించిన మన పెద్దవారిని స్మరించుకొని వారికి తర్పణాలు చేయటం వల్ల వారి ఆత్మ శాంతిస్తుంది. అలాగే వారి ఆశీస్సులు కూడా మనపై ఉండి మనపై ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. అయితే ఈ 15 రోజులు ఎంతో నియమ నిష్టలను పాటిస్తూ పెద్దవారిని స్మరించుకోవడం ఎంతో మంచిది.
Bandi Bhagirath POCSO Case Update: కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్కు సంబంధించిన పోక్సో కేసు వ్యవహారం…
Narendra Modi: అంతర్జాతీయ మార్కెట్లో ముడిచమురు ధరలు పెరిగాయా? అయితే ఆ భారాన్ని పైసా పైసా చొప్పున లీటర్ మీద…
AP Politics: రాజకీయాల్లో టైమింగ్, లాజిక్ అనేవి చాలా ముఖ్యం. ఏ చిన్న తప్పు చేసినా ప్రత్యర్థులకు అస్త్రంగా దొరికిపోతాం.…
Bandi Bhagirath Case: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన పోక్సో కేసులో నిందితుడు బండి భగీరథ్ చుట్టూ ఉచ్చు…
Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జనసేన గ్రాఫ్ రోజురోజుకూ పెరుగుతోంది. కూటమి ప్రభుత్వంలో డిప్యూటీ సీఎంగా పవన్ కల్యాణ్ పాలనలో…
Telangana Politics: తెలంగాణ రాజకీయాల్లో తనదైన స్పీడుతో దూసుకుపోతున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి.. ఇప్పుడు జాతీయ రాజకీయాల వైపు కూడా…
This website uses cookies.