Health Tips: ప్రతిరోజు ఉదయం చాలామంది అల్పాహారం తీసుకుని వారి వారి పనులకు వెళ్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది ఏ మాత్రం సమయం లేకపోవడంతో మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ పిండిని ఇంట్లో పెట్టుకుని వాటితో టిఫిన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే చాలామంది పిల్లలు దోసే ఇడ్లీ పిండిని ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ పిండితో ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ చేసుకుని తింటూ ఉంటారు అయితే ఇలా ఫ్రిజ్లో నిలువ చేసుకున్న పిండిని తినడం మంచిదేనా అంటే నిపుణులు మంచిది కాదని చెబుతున్నారు.
మనం ఇంట్లో తయారు చేసుకున్న దోస లేదా ఇడ్లీ పిండి 24 గంటల తర్వాత బాగా పులిసిపోతుంది. తద్వారా పిండి రుచి వాసన కూడా మారిపోతుంది అలాంటి పిండితో మనం ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ పిండిని ఫ్రిడ్జ్ లోకి పెట్టిన లేదా బయటపెట్టిన కూడా 24 గంటల తర్వాత పులిసిపోతుంది.
ఈ విధంగా పులిసిన పిండిని తినడం వల్ల అజీర్తి, కడుపులో మంట, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పులిసిన పిండిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే తీనేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో లభించే వాటిని తినకపోవడం చాలావరకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం ఇంట్లో ఫ్రెష్ గా తయారు చేసుకునే పిండిని తినటం మంచిది.
Dil Raju: బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్, టాలీవుడ్ స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు కాంబినేషన్లో ఓ సినిమా…
Pawan Kalyan-Suswagatham: సౌందర్య..ఈ పేరు వింటే చాలు ప్రతీ ఒక్కరికీ ఆమె నటించిన అద్భుతమైన సినిమాలు కళ్ళ ముందు అలా…
Ananya Nagalla: యంగ్ బ్యూటీ అనన్య నాగళ్ల హీరోయిన్ గా నటిస్తున్న తాజా చిత్రం "లీసా". వెంకట్ దుగ్గిరెడ్డి (యూఎస్ఏ),…
Prabhas-Spirit: ప్రస్తుతం మన పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న సినిమాలలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా రూపొందుతున్న సినిమా స్పిరిట్. కాప్…
ALLU ARJUN: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా రూపొందుతున్న లేటెస్ట్ సినిమాకి టైటిల్ ని రివీల్ చేసింది చిత్ర…
Ram Charan: భాష ఏదైనా..హీరో ఎవరైనా..ఎంత భారీ బడ్జెట్తో సినిమాను నిర్మించినా.. కథలో బలం, వాస్తవిక సంఘటనలతో అల్లుకున్న సన్నివేశాలలో…
This website uses cookies.