Health Tips: ప్రతిరోజు ఉదయం చాలామంది అల్పాహారం తీసుకుని వారి వారి పనులకు వెళ్తూ ఉంటారు. ఇక ఇటీవల కాలంలో చాలామంది ఏ మాత్రం సమయం లేకపోవడంతో మార్కెట్లో దొరికే ఇన్స్టంట్ పిండిని ఇంట్లో పెట్టుకుని వాటితో టిఫిన్ చేసుకుని వెళ్తూ ఉంటారు. అలాగే చాలామంది పిల్లలు దోసే ఇడ్లీ పిండిని ఎక్కువగా తయారు చేసుకుని ఫ్రిజ్లో నిల్వ చేసుకుంటూ ఉంటారు. ఇక ఆ పిండితో ప్రతిరోజు ఏదో ఒక వెరైటీ చేసుకుని తింటూ ఉంటారు అయితే ఇలా ఫ్రిజ్లో నిలువ చేసుకున్న పిండిని తినడం మంచిదేనా అంటే నిపుణులు మంచిది కాదని చెబుతున్నారు.
మనం ఇంట్లో తయారు చేసుకున్న దోస లేదా ఇడ్లీ పిండి 24 గంటల తర్వాత బాగా పులిసిపోతుంది. తద్వారా పిండి రుచి వాసన కూడా మారిపోతుంది అలాంటి పిండితో మనం ఆహార పదార్థాలను తయారు చేసుకుని తినటం వల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. ఆ పిండిని ఫ్రిడ్జ్ లోకి పెట్టిన లేదా బయటపెట్టిన కూడా 24 గంటల తర్వాత పులిసిపోతుంది.
ఈ విధంగా పులిసిన పిండిని తినడం వల్ల అజీర్తి, కడుపులో మంట, ఇన్ఫెక్షన్, గ్యాస్ వంటి సమస్యలు తలెత్తుతాయి. అందుకే పులిసిన పిండిని ఎట్టి పరిస్థితుల్లో తినకూడదు. అలాగే ఇడ్లీ, దోసె పిండిని రుబ్బిన 24 గంటల్లోనే తీనేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇక మార్కెట్లో లభించే వాటిని తినకపోవడం చాలావరకు మంచిదని నిపుణులు చెబుతున్నారు. మనం ఇంట్లో ఫ్రెష్ గా తయారు చేసుకునే పిండిని తినటం మంచిది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.