Sandals: సాధారణంగా కొంతమంది దేవాలయాలకు చెప్పులు వేసుకొని వెళ్తే మరికొందరు చెప్పులు లేకుండా వెళ్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో దేవాలయాలకు వెళ్ళినప్పుడు చెప్పులు పోవడం అన్నది కామన్ అయిపోయింది. వారి చెప్పులే అనుకోని పొరపాటున ఇతరుల చెప్పులు వేసుకొని వెళ్లడం, లేదంటే చెప్పులు దొంగలించడం లాంటివి చేస్తున్నారు. దీంతో చాలామంది గుడికి చెప్పులు వేసుకుని వెళ్లడమే మానేశారు. దాంతో చాలామంది చెప్పులు పోయాయని బాధపడుతూ ఉంటారు. ఇంకొందరు మాత్రం గుడి దగ్గర చెప్పులు పోతే మంచిదని, మనకున్న శని మొత్తం పోతుంది అని నమ్ముతూ ఉంటారు. మరి నిజంగానే గుడి దగ్గర చెప్పులు పోవడం మంచిదేనా ఈ విషయంపై పండితులు ఏం చెబుతున్నారో ఇప్పుడు మనం తెలుసుకుందాం..
ఒకవేళ ఆలయాల వద్ద మీ చెప్పులు చోరీకి గురైతే బాధ పడటం మానేసి సంతోషంగా ఉండాలి. ఎందుకంటే ఆలయాల వద్ద చెప్పులు పోవడం మన జీవితంలో జరిగే శుభాలకు సంకేతంగా భావించాలి. అంతేకాకుండా దేవాలయాల వద్ద చెప్పులు పోవడం అన్నది అదృష్టంగా భావించాలి. చెప్పులు పోతే మన జీవితంలో శని బాధలు తొలగిపోతాయని చెబుతారు. చెప్పులు చోరీకి గురైతే అప్పుల బాధ నుండి బయటపడతామని, పేదరికం నుండి విముక్తి దొరుకుతుందని అర్థం. మరీ ముఖ్యంగా శనివారం రోజు ఆలయం వద్ద చెప్పులు పోతే మరీ మంచిదట. శనివారం నాడు ఆలయం వద్ద చెప్పులు దొంగిలించబడితే మన జీవితంలో ఉన్న దరిద్రం కూడా తొలగిపోతుందని అర్థం. చెప్పులను దానం చేయడం వల్ల, లేదా చెప్పులను ఎవరైనా తీసుకోవడం వల్ల శని వల్ల కలిగే ప్రతికూల ప్రభావాలు తొలగిపోతాయట.
మాములుగా శనిగ్రహం పాదాలలో నివసిస్తుందని చాలామంది చెబుతుంటారు. అటువంటి పాదాలకు ధరించే చెప్పుల పైన శని ప్రభావం ఉంటుందని చెప్తారు. రంగులు, తోలు రెండు శనిదేవుడికి సంబంధించినవి. కాబట్టి శని దేవుడి ప్రతికూల ప్రభావాల నుంచి బయట పడటం కోసం చాలామంది కావాలని ఆలయాల వద్ద శనివారం నాడు వారి బూట్లు, చెప్పులు వదిలివేస్తారు. దీనివల్ల తమ జీవితంలోని ప్రతికూల ఫలితాలు పోతాయని నమ్ముతారు. ఇలా చేయడం వల్ల శని దేవుడు కలిగించే బాధల నుంచి విముక్తి లభిస్తుందని చెబుతారు. జాతకంలో శని వక్ర దృష్టి ఉంటే మనం ఎంత కష్టపడినా అనుకున్న పనులు జరగవు. అలాంటప్పుడు ఆలయాల వద్ద చెప్పులు ఎవరైనా చోరీ చేస్తే, లేదా మనమే చెప్పులు వదిలేస్తే కచ్చితంగా కష్టాలు తొలగిపోతాయి.
Tirumala Tirupati: తిరుమలలోని శ్రీవారి దర్శనం కోసం వచ్చే భక్తుల సంఖ్య ఏమాత్రం తగ్గడం లేదు. వేసవి సెలవులు పూర్తి…
AP POLITICS: ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి విషయంలో గత కొంతకాలంగా సాగుతున్న సస్పెన్స్కు తెరదించుతూ కేంద్ర ప్రభుత్వం అత్యంత కీలకమైన…
Peddi Collections: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ బాక్సాఫీస్ దగ్గర వేటాడటం మొదలుపెడితే రికార్డులు బద్దలు కావాల్సిందేనని మరోసారి నిరూపితమైంది.…
Breast Cancer: ఇటీవల కాలంలో క్యాన్సర్ అనే మహమ్మారి విస్తృతంగా వ్యాప్తి చెందుతూ ఎంతో మంది ప్రాణాలను బలి తీసుకుంటూ…
Politics: తెలంగాణ రాజకీయం ఒక సరికొత్త మలుపు తిరిగింది. నిన్నటివరకు రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ చుట్టూనే తిరిగిన రాజకీయం..…
Politics: భారత రాజకీయ చరిత్రలో సరికొత్త శకం ఆరంభమైంది. సమకాలీన రాజకీయాల్లో తిరుగులేని నేతగా ఎదిగిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ,…
This website uses cookies.