Banana Peel: మామూలుగా మనం అరటిపండును తిన్న తర్వాత అరటి తొక్కను విసిరేస్తూ ఉంటాం. అయితే మీకు తెలుసా, కేవలం అరటిపండు వల్ల మాత్రమే కాకుండా అరటి తొక్క వల్ల కూడా ఎన్నో రకాల అద్భుతమైన ప్రయోజనాలు ఉన్నాయి. మరి అరటి పండు తొక్క వల్ల కలిగే ఆ ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం.. అరటి పండు తొక్కలో ఉండే ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చర్మానికి ఎంతో మేలు చేస్తాయి. అరటి తొక్క లోపలి భాగంతో ముఖాన్ని రుద్ది ఒక అరగంట సేపు ఆగి చల్లటి నీళ్లతో కడుగాలి. ఇలా ఒక వారం పాటు చేస్తే మీ ముఖం పై ఉన్న ముడతలను ఈజీగా తగ్గించుకోవచ్చు. మనం మామూలుగా బయట ఎక్కడెక్కడో తిరగాల్సి వస్తూ ఉంటుంది. ఎండలో తిరగడం వల్ల చర్మం అంతా జిడ్డు జిడ్డు అయిపోతుంది.
అలాంటప్పుడు అరటి పండు తొక్క లోపలి భాగాన్ని ముఖంపై రుద్ది అరగంట సేపు ఆగాక గోరు వెచ్చని నీటితో ముఖాన్ని కడిగేయాలి. ఇలా చేయడం వల్ల ముఖ సౌందర్యాన్ని పెంచుకోవచ్చు.కొందరికి పళ్లు కొద్దిగా లేత పసుపు రంగులోకి మారుతూ ఉంటాయి. ఎంత తోమినా తెల్లగా కాకపోగా పళ్లను పెదవుల కిందే దాచుకోవాల్సి వస్తుంది. అలాంటి సమయంలో అరటి తొక్క లోపలి భాగంతో పళ్ళని రుద్దడం వల్ల మీ పళ్ళు నిగ నిగలాడుతూ తెల్లగా మెరిసిపోతాయి. అలాగే ఏదైనా దోమ వంటి పురుగుల కాటుకు గురై చర్మంపై దురదలు, మంటలు కనుక వస్తే వాటిని తగ్గించడానికి అరటి పండు తొక్క ఉపయోగపడుతుంది.
చర్మంపై ఎక్కడైతే సమస్యగా ఉందో అక్కడ అరటి పండు తొక్కను రాసి 10 నిమిషాలు ఆగి ఆ తర్వాత కడిగేయాలి. ఇలా చేయడం వల్ల దురద, మంట తగ్గిపోతుంది. అలాగే కాలిన గాయాలు, దెబ్బలకు అరటి పండు తొక్క ఒక మంచి ఔషధంగా పనిచేస్తుంది. సమస్య ఉన్న శరీర భాగంపై అరటి పండు తొక్కను ఉంచి కట్టు కట్టాలి. రాత్రంతా దాన్ని అలాగే ఉంచాలి. రోజూ రాత్రి ఇలా చేస్తే ఒకటి, రెండు రోజుల్లోనే దెబ్బలు మానిపోతాయి.
Health care: మనం ఆరోగ్యవంతంగా ఉండాలి అంటే సరైన తిండితో పాటు నిద్ర కూడా ఎంతో అవసరం. సరైన నిద్ర…
Black Dress: మన హిందూ సంప్రదాయాల ప్రకారం ఏదైనా పూజ కార్యక్రమాలు జరిగినప్పుడు శుభప్రదమైన దుస్తులను ధరించడం ఆనవాయితీగా వస్తుంది.…
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
This website uses cookies.