Politics: నారా లోకేష్ ఈనెల 27 నుంచి పాదయాత్ర చేయబోతున్న సంగతి అందరికీ తెలిసిందే. యువ గళం పేరుతో ఈ పాదయాత్రను చేపట్టడానికి ఇప్పటికే రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు. కుప్పం నుంచి ఇచ్చాపురం వరకు సుమారు 123 నియోజకవర్గాల్లో నాలుగు వేల కిలోమీటర్ల పాదయాత్రను చేయడానికి నారా లోకేష్ నిర్ణయించుకున్నారు. అయితే ఈ పాదయాత్ర కోసం ఇప్పటికే టీడీపీ పార్టీ డీజీపీకి పర్మిషన్ కోసం లేఖ రాశారు. అయితే డీజీపీ కార్యాలయం నుంచి ఇప్పటివరకు పాదయాత్రపై ఎలాంటి అనుమతి రాలేదు. తాజాగా ఈ పాదయాత్రలో ఎంతమంది పాల్గొంటారు ఎన్ని రోజులు జరుగుతుంది. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు పాదయాత్ర కొనసాగిస్తారు అనే వివరాలతో అనుమతి కోసం దరఖాస్తు చేసుకోవాలని డీజీపీ నుంచి తెలుగుదేశం పార్టీకి ఆదేశాలు వచ్చాయి.
అయితే పాదయాత్రను కావాలని వైసీపీ ప్రభుత్వం అడ్డుకోవాలని చూస్తుందని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. పాదయాత్ర చేస్తే ఎక్కడ ప్రజా వ్యతిరేకత తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా మారిపోతుందో అనే భయం వైసీపీ పార్టీలో ఉందని టీడీపీ నేతలు అంటున్నారు. గతంలో వైయస్ జగన్ పాదయాత్రకి అనుమతి ఇవ్వకుండా ఉంటే ఈరోజు అధికారంలోకి వచ్చే వారే కాదని విమర్శిస్తున్నారు. అలాగే ప్రభుత్వం అనుమతులు ఇచ్చిన ఇవ్వకున్నా పాదయాత్ర మాత్రం ఖచ్చితంగా జరిగి తీరుతుందని వర్ల రామయ్య తెలిపారు. కావాలని కుట్రలు చేస్తూ పాదయాత్రకు ఆటంకం సృష్టించాలని భావిస్తున్నారని విమర్శించారు. జగన్ పరిపాలనపై విసిగిపోయి ఉన్న ప్రజలందరూ కూడా ఖచ్చితంగా పాదయాత్రలో పాల్గొంటారని అన్నారు.
అలాగే నారా లోకేష్ పాదయాత్రలో దాడులు చేయాలని వైసిపి సోషల్ మీడియా గ్రూప్స్ వాట్సాప్ లో సందేశాలు పంపుతున్నారని తెలుగుదేశం పార్టీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. వీటిని ఆధారాలతో సహా చూపించారు. కుట్రలు చేసి పాదయాత్రను అడ్డుకోవాలని ప్రయత్నిస్తే అంతే దీటుగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు సమాధానం చెబుతారని అన్నారు. మొత్తానికి ఇప్పుడు తెలుగుదేశం వైసిపి పార్టీల మధ్య నారా లోకేష్ పాదయాత్ర మీద రాజకీయం నడుస్తుంది అనే మాట వినిపిస్తుంది.
Bandi Bhagirath: తెలంగాణ రాజకీయాల్లో ప్రస్తుతం ఒకే వార్త దావాగ్నంలా వ్యాపిస్తోంది. కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు…
Pawan Kalyan: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మళ్ళీ వేడి మొదలైంది. గత మూడు వారాలుగా శస్త్రచికిత్స నిమిత్తం విశ్రాంతి తీసుకుంటున్న ఉప…
Petrol Price News: అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. రష్యా-ఉక్రెయిన్, పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో బ్యారెల్…
CM Revanth Reddy: హైదరాబాద్ వేదికగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విసిరిన రాజకీయ పాచికను తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి…
Narendra Modi: భారతదేశ ఆర్థిక చరిత్రలో ఇదొక అసాధారణ అడుగు. పసిడిని ప్రాణంగా భావించే దేశ ప్రజలను ఉద్దేశించి.. ఏడాది…
Roja Selvamani: సినీ వెండితెరపై ‘ఐరన్ లెగ్’ నుంచి ‘గోల్డెన్ లెగ్’గా మారి, రాజకీయాల్లోనూ తనదైన ముద్ర వేసిన ఫైర్…
This website uses cookies.