Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన స్థానాలలో గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికోసం వారాహితో బస్సుయాత్ర మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఏపీలో ఈ సారి కచ్చితంగా జనసేనాని ప్రభావం బలంగా ఉంటుందని, తక్కువలో తక్కువ 20 నుంచి 40 స్థానాల వరకు గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అలాగే తమ ఓటు షేర్ 24 శాతం ప్రస్తుతం ఏపీలో ఉందని నాగబాబు చెప్పుకొచ్చారు. దీనిని బట్టి కచ్చితంగా ప్రభావవంతమైన స్థానాలలో గెలవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే మరో వైపు తెలంగాణలో కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళడానికి రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే అన్ని స్థానాలలో పోటీ చేయకపోయిన కచ్చితంగా పార్టీ క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో చెప్పారు. ఇక 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే కనీసం 35 నుంచి 40 అసెంబ్లీ సీట్లలో కూడా జనసేన తెలంగాణలో పోటీ చేయడానికి రెడీ అవుతుంది. అయితే తెలంగాణలో ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావాలని అనుకుంటున్నా బీజేపీ అవకాశాలకి జనసేన రూపంలో గండి పడే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Panipuri: ఇటీవల కాలంలో పానీపూరి తినే వారి సంఖ్య ఎక్కువ అయ్యింది. సాయంత్రమైతే చాలు వీధి చివర బండ్లపై పానీ…
Varalakshmi Vratam 2026: శ్రావణమాసం వచ్చిందంటే చాలు పెద్ద ఎత్తున పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. ఇక శ్రావణమాసంలో మహిళలు…
Papaya In Mansoon: పండ్లు ఎన్నో రకాల పోషకాలను కలిగి ఉంటాయి అనే సంగతి మనకు తెలిసిందే. ఇలా అనేక…
TTD: కలియుగ దైవమైన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనార్థం ఎంతోమంది భక్తులు తరలివస్తున్నారు. వేసవి సెలవులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు…
Ginger Tea: చాలామందికి ఉదయం నిద్ర లేవగానే ఒక కప్పు టీ తాగనిదే రోజు గడవదు. ఒక కప్పు టీ…
Shiva Pooja: శివుడిని అభిషేక ప్రియుడు అని పిలుస్తుంటారు ఆయనకు అభిషేకం చేసి కోరికలు కోరితే తప్పకుండా నెరవేరుస్తారని భక్తులు…
This website uses cookies.