Politics: జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రానున్న ఎన్నికలని దృష్టిలో పెట్టుకొని ఇప్పటి నుంచే తన కార్యాచరణ సిద్ధం చేసుకుంటున్నారు. ఏపీలో బలమైన స్థానాలలో గెలవడం ద్వారా ప్రభుత్వం ఏర్పాటులో కీలకంగా మారాలని పవన్ కళ్యాణ్ భావిస్తున్నారు. దీనికోసం వారాహితో బస్సుయాత్ర మొదలుపెట్టడానికి సిద్ధం అవుతున్నారు. ఏపీలో ఈ సారి కచ్చితంగా జనసేనాని ప్రభావం బలంగా ఉంటుందని, తక్కువలో తక్కువ 20 నుంచి 40 స్థానాల వరకు గెలుపొందే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు కూడా అంటున్నారు. అలాగే తమ ఓటు షేర్ 24 శాతం ప్రస్తుతం ఏపీలో ఉందని నాగబాబు చెప్పుకొచ్చారు. దీనిని బట్టి కచ్చితంగా ప్రభావవంతమైన స్థానాలలో గెలవడం గ్యారెంటీ అనే మాట వినిపిస్తుంది.
ఇదిలా ఉంటే మరో వైపు తెలంగాణలో కూడా జనసేన పార్టీలో పవన్ కళ్యాణ్ వెంట నడుస్తున్న కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. వారిని దృష్టిలో ఉంచుకొని పార్టీని బలంగా ప్రజలలోకి తీసుకెళ్ళడానికి రానున్న ఎన్నికలలో పోటీ చేయడానికి రెడీ అవుతున్నారు. అయితే అన్ని స్థానాలలో పోటీ చేయకపోయిన కచ్చితంగా పార్టీ క్యాడర్ బలంగా ఉన్న నియోజకవర్గాలలో పోటీ చేస్తామని పవన్ కళ్యాణ్ కొండగట్టు పర్యటనలో చెప్పారు. ఇక 7 నుంచి 14 పార్లమెంట్ స్థానాలలో పోటీ చేసే ఆలోచనలో ఉన్నామని చెప్పారు. ఈ లెక్కన చూసుకుంటే కనీసం 35 నుంచి 40 అసెంబ్లీ సీట్లలో కూడా జనసేన తెలంగాణలో పోటీ చేయడానికి రెడీ అవుతుంది. అయితే తెలంగాణలో ఈ సారి ఎలా అయిన అధికారంలోకి రావాలని అనుకుంటున్నా బీజేపీ అవకాశాలకి జనసేన రూపంలో గండి పడే అవకాశం ఉందనే మాట రాజకీయ వర్గాలలో వినిపిస్తుంది.
Tooth Decay: మన శరీరంలో ప్రతి ఒక్క అవయవం ఆరోగ్యవంతంగా ఉంటేనే మనం కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. మన…
Temple Donation: మన హిందూ సాంప్రదాయాల ప్రకారం మనం ఏదైనా ఆలయానికి వెళ్ళినప్పుడు అక్కడ పూజ హోమాలు నిర్వహించిన లేదా…
Health care: ఇటీవల కాలంలో ప్రతి ఒక్కరూ మొబైల్ ఫోన్ కు అంకితం అవడం లేదంటే వారి వృత్తిపరమైన జీవితంలో…
Tirumala: తిరుమల తిరుపతిలో కొలువై ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనం కోసం పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తూ ఉంటారు.…
Covid 19: దేశవ్యాప్తంగా కరోనా కేసులు నమోదు అవుతున్న నేపథ్యంలో వైద్య ఆరోగ్యశాఖ అప్రమత్తమయింది. ఇప్పటికే ఏపీలో పాటు పలు…
Ashada Masam: మన తెలుగు నెలలలో ఆషాడ మాసం ఒకటి. ఈ ఆషాడం మాసానికి కూడా ఎంతో ప్రత్యేకత ఉంది.…
This website uses cookies.